మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`. పాన్ ఇండియా స్టాయిలో హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ఫిల్మ్ మేకర్స్ తో పాటు సినీ ప్రియుల్లోనూ భారీ క్రేజ్ ని సోంతం చేసుకుంది. `బాహుబలి` తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన మూవీ కావడంతో సహజంగానే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
దీనికి తోడుగా రాజమౌళి ఈ మూవీ ప్రమోషన్స్ కోసం భారీ ప్లాన్ లు వేయడం.. దాదాను 20 కోట్లు ప్రమోషన్స్ కి ఖర్చు పెట్టించడం ఇందు కోసం బాలీవుడ్ లో వారం పాటు రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి మకాం వేయడం అక్కడి కీలక మీడియాల్లో వరుస ప్రమోషన్స్ చేయడంతో `ఆర్ ఆర్ ఆర్` ఉత్తరాదిలోనూ హాట్ టాపిక్ గా మారింది. సినిమాపై అక్కడి ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ ఏర్పడింది.
దీంతో ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని రాజమౌళి అప్పుడే లెక్కలు కూడా వేసుకున్నారు. జనవరి 7న వరల్డ్ వైడ్ గా 14 బాషల్లో రిలీజ్ అని ప్లాన్ కూడా చేశారు. అనని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. సడన్ గా ఒమిక్రాన్ కరోనా ప్రమాద ఘంటికలు మోగించడం యాభై శాతం ఆక్యుపెన్సీని కొన్నిఈశాన్య రాష్ట్రాలు రెడీ కావడం నైట్ కర్ఫ్యూ విధించడం వంటి కారణాలతో అర్థాంతరంగా ఈ మూవీ రిలీజ్ ఆగిపోయింది.
అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో `ఆర్ ఆర్ ఆర్`కి హిందీలో పెద్దగా బజ్ లేదా అంటే నిజమే అని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తారక్ చరణ్ ఇద్దరు నార్త్ ఆడియన్స్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయారన్నది బాంబే వర్గాలు వినిపిస్తున్న లేటెస్ట్ టాక్. అయితే కోవిడ్ కారణంగా రిలీజ్ వాయిదా పడటంతో మరోసారి ఉత్తరాదిలో `ఆర్ ఆర్ ఆర్` ప్రమోషన్స్ కి టైమ్ లభించింది. మరి ఈ సమయాన్ని జక్కన్న ఎలా వుపయోగించుకుంటాడో చూడాలి అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.