Begin typing your search above and press return to search.

'పొన్నియిన్ సెల్వన్' నుంచి ఇంట్రస్టింగ్ అప్ డేట్!

By:  Tupaki Desk   |   19 Sep 2021 8:32 AM GMT
పొన్నియిన్ సెల్వన్ నుంచి ఇంట్రస్టింగ్ అప్ డేట్!
X
దక్షిణాది దర్శక దిగ్గజాలలో మణిరత్నం స్థానం ప్రత్యేకం. ఒక కథను ఆయన చెప్పేతీరు కొత్తగా ఉంటుంది. దానిని తెరపై ఆవిష్కరించే తీరు బిన్నంగా ఉంటుంది. ఆయన ఎంచుకునే కథలు .. సహజత్వాన్ని దగ్గరగా ఉంటాయి. ఆయన కథలు స్టార్ ల చుట్టూ కాకుండా, పాత్రలను కలువుకుని వెళుతూ కనిపిస్తుంటాయి. అందువల్లనే ఆయన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు. ఇక దర్శకులు .. దర్శకులు కావాలనుకునేవారు ఆయన సినిమాలను తప్పకుండా చూస్తుంటారు. ఎందుకంటే ఆయన ప్రతి ఫ్రేమ్ ఒక పాఠం చెబుతూ ఉంటుంది.

మణిరత్నం ఒక సినిమాను తపస్సులానో .. యజ్ఞంలానో చేస్తుంటారు. అంతగా కసరత్తు చేసిన తరువాతనే ఆయన సెట్స్ పైకి వెళుతుంటారు. ఈ సారి ఆయన చారిత్రక నేపథ్యంలో కూడిన కథను ఎంచుకున్నారు. ఓ తమిళ నవల ఆధారంగా 'పొన్నియిన్ సెల్వన్' సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లారు. చోళరాజుల కాలం నటి కథ ఇది. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి మణిరత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. రీసెంట్ గా ఫస్టు పార్టుకు సంబంధించిన షూటింగు పూర్తయింది.

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఫస్టు పార్టును వచ్చే వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. అందువల్లనే ఆయా భాషలకి చెందిన స్టార్ లను తీసుకున్నారు. విక్రమ్ ... ఐశ్వర్య రాయ్ .. త్రిష .. కార్తి .. జయం రవి తదితరులు ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు. మణిరత్నం అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. అన్ని భాషల్లోను ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. కొంతకాలంగా మణిరత్నం ఎదురుచూస్తున్న సంచలనాత్మక విజయం, ఈ సినిమాతో లభిస్తుందేమో చూడాలి.