Begin typing your search above and press return to search.

చైనాకు మరోసారి స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చిన భారత్​...

By:  Tupaki Desk   |   25 Jan 2021 7:28 AM GMT
చైనాకు మరోసారి స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చిన భారత్​...
X
గత కొంతకాలంగా చైనా .. భారత మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చాయి. పైగా ఆ ప్రాంతం తమదేనంటూ చైనా వితండ వాదన చేస్తున్నది. ఇప్పటికే పలుమార్లు సరిహద్దు వివాదంపై చర్చలు జరిగాయి. తాజాగా ఆదివారం కూడా చైనా.. భారత్​ సైనికుల మధ్య మరోసారి చర్చలు జరిగాయి. అయితే రెండున్నర నెలల తర్వతా ఈ చర్చలు జరిగినట్టు సమాచారం.

చైనా భూభాగంలోని చూషుల్-మోల్దో సరిహద్దు శిబిరం వద్ద ఈ చర్చలు జరిగాయి. వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా తన సైన్యాలను పూర్తిగా వెనక్కు మళ్లించాలని ఈ సందర్భంగా భారత్ మరోసారి స్పష్టం చేసింది. అయితే వివాదాస్పద స్థలాల నుంచి వెంటనే సైన్యాన్ని వెనక్కితీసుకోవాలని చైనా సైన్యానికి .. భారత్​ సైనికాధికారులు స్పష్టం చేశారట. ఈ విషయంపై చైనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

పాంగాంగ్ సరస్సు, చూషుల్, గోగ్రా-హాట్‌స్పింగ్స్‌లో చైనా బలగాలను మోహరించింది. అక్కడినుంచి బలగాలను వెనక్కు మళ్లించాలని భారత్​ కోరింది.

భారత బృందానికి 14 కార్స్స్ కమాండర్ లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మేనన్‌ నేతృత్వం వహించగా... చైనా తరఫున దక్షిణ జిన్జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ మేజర్ జనరల్ లియూ లిన్ నేతృత్వం వహించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు.. రాత్రి 8 గంటలకు వరకు కొనసాగాయి. బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతల సడలింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత చైనాపైనే ఉందని భారత బృందం స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై చైనా వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.