Begin typing your search above and press return to search.

బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో రిపీట్‌.. ఈసారి ఏం చేస్తారో!

By:  Tupaki Desk   |   23 Sep 2022 3:30 PM GMT
బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో రిపీట్‌.. ఈసారి ఏం చేస్తారో!
X
బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాల‌ని అందించిన కాంబినేష‌న్ లు మ‌ళ్లీ మ‌ళ్లీ రిపీట్ అయితే చూడాల‌ని ఫ్యాన్స్ ఆశ‌గా ఎదురుచూస్తుంటారు. మ‌ళ్లీ ఇద్ద‌రు క‌లిసి అదే త‌ర‌హా మ్యాజిక్ చేయాల‌ని కోరుకుంటుంటారు. అలా కోరుకుంటున్న‌ బ‌న్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ రాబోతున్న‌ట్టుగా తెలుస్తోంది. స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌, అల్లు అర్జున్ క‌లిసి మ‌రోసారి స‌ని చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఇప్ప‌టి వర‌కు మూడు హిట్ సినిమాలొచ్చాయి.

2020 జ‌న‌వ‌రి 12న క్రాంతి బ‌రిలో నిలిచిన `అల వైకుంఠ‌పుర‌ములో` సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచి బ‌న్నీ కెరీర్ లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా స‌రికొత్త రికార్డుని సొతంం చేసుకుంది. ఆడియో ప‌రంగా కూడా త‌మ‌న్ అందించిన మ్యూజిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయ‌ర్ గా నిలిచి ఈ మూవీ నెట్టింట వైర‌ల్ గా ట్రెండ్ అయ్యేలా చేసింది. అంతే కాకుండా బిగ్ బ్యాంగ్ లాంటి రికార్డు బ్రేకింగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో బ‌న్నీకి ఈ మూవీతో తిరుగులేని విజ‌యం ల‌భించడం విశేషం.

ఇదిలా వుంటే ఈ సంచ‌ల‌న బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత త్రివిక్ర‌మ్, అల్లు అర్జున్ క‌లిసి మ‌రో సినిమాకు రెడీ అవుతున్నార‌ట‌. ఇది వీరి క‌ల‌యిక‌లో రానున్న నాలుగవ ప్రాజెక్ట్. ఫ్యాన్స్ కూడా వీరిద్ద‌రి బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రావాలని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలుస్తోంది. ఈ వార్త నిజంగా బ‌న్నీ ఫ్యాన్స్ కి పండ‌గే అని ఇన్ సైడ్ టాక్‌.

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తో క‌లిసి పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ `పుష్ప‌` సీక్వెల్ ని ప‌ట్టాలెక్కించే ప‌నుల్లో బిజీగా వున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ భారీ పాన్ ఇండియా సీక్వెల్ ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ ప్రాజెక్ట్ ని అక్టోబ‌ర్ 1 నుంచి లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆరోజు `అల్లు స్టూడియోస్` ప్రారంభం కానున్న నేప‌థ్యంలో `పుష్ప 2`ని కూడా అక్క‌డే మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ చేసిన‌ట్టుగా తెలిసింది.

ఇక త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో SSMB28 ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ సెప్టెంబ‌ర్ 12న అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ప్రారంభ‌మైంది. ఆ త‌రువాత యూనిట్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అయ్యారు. అన్బు అరివు ఫైట్ మాస్ట‌ర్ల నేతృత్వంలో కీల‌క యాక్ష‌న్ సీన్స్ ని షూట్ చేశారు. ప్ర‌స్తుతం ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌యింది. ఫెస్టివ‌ల్ త‌రువాత త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ రెండు సినిమాల త‌రువాతే బ‌న్నీ - త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ ని ప్రారంభించే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ సారి ఎలాంటి సినిమాతో వ‌స్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.