Begin typing your search above and press return to search.

సర్కారు వారి పాట ఆ బ్యాంకులోనే మొదలు

By:  Tupaki Desk   |   28 Jun 2020 7:50 AM GMT
సర్కారు వారి పాట ఆ బ్యాంకులోనే మొదలు
X
మహేష్‌ బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతున్నాయి. షూటింగ్‌ ఆరంభంకు ఇంకా సమయం ఉంది. అయితే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మాత్రం విరామం లేకుండా జరుగుతుంది. ఇప్పటికే హీరోయిన్స్‌ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. కీర్తి సురేష్‌ సర్కారు వారి పాట చిత్రంలో నటించబోతున్నట్లుగా ఒక లైవ్‌ లో పేర్కొంది. ఇక నివేదా థామస్‌ ను కూడా ఈ చిత్రంలో లీడ్‌ పాత్రకు ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇక ఈ చిత్రం కోసం ప్రముఖ స్టూడియోలో భారీ బ్యాంకు సెట్‌ ను నిర్మిస్తున్నారట. దాదాపు అయిదు కోట్లు ఖర్చు చేసి ఆర్ట్‌ డైరెక్టర్‌ ఏఎస్‌ ప్రకాష్‌ తో ఈ సెట్‌ ను వేయిస్తున్నారు. కేవలం ఒక్క బ్యాంకు అని కాకుండా పలు బ్యాంకుల సెట్‌ లను ఇందులోనే చూపించబోతున్నారు. మొత్తం నాలుగు ఫ్లోర్స్‌ లో ఈ సెట్‌ ఉంటుందని అందులో పలు బ్యాంకులు ఉంటాయని అంటున్నారు. సినిమా షూటింగ్‌ ఈ బ్యాంక్‌ సెట్టింగ్‌ లో మొదలు కాబోతుందట.

సినిమా షూటింగ్‌ ఎక్కువగా బ్యాంకుల్లో ఉంటాయట. అందుకే ఏకంగా అయిదు కోట్లు పెట్టి మరీ ఈ సెట్టింగ్‌ వేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విదేశీ బ్యాంక్‌ సెట్‌ కూడా ఇందులో ఉంటుందని టాక్‌. బ్యాంకింగ్‌ రంగంలో జరుగుతున్న అవినీతి ప్రధానంగా సాగే ఈ చిత్రంలో మంచి మెసేజ్‌ తో పాటు ప్రేమ కథ ఉంటుందనేదట.

మహేష్‌ బాబు కీర్తి సురేష్‌ లు మొదటి సారి జత కట్టబోతుండటంతో పాటు ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకున్న నివేదా థామస్‌ కూడా నటిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని కూడా టాక్‌. త్వరలోనే ఈ వార్తలన్నింటిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.