Begin typing your search above and press return to search.
హనీ రోజ్.. ఇదెక్కడి క్రేజ్ రా మావా
By: Tupaki Desk | 5 Feb 2023 5:48 PM GMTహనీ రోజ్.. సినీ కెరీర్ వీరసింహారెడ్డికి ముందు, ఆ తర్వాత అన్నట్టుగా మారిపోయింది. ఈ చిత్రంలో హనీ రోజ్.. మీనాక్షి పాత్రతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అందంతో పాటు నటనతోనూ ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో మస్తు క్రేజ్, పాపులారిటీని దక్కించుకుంది.
నిజానికి మలయాళం లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ .. ఇప్పుడు వీరా క్రేజ్ తో తెలుగులో కూడా వరుస ఆఫర్లు రావడం ఖాయం అని రుజువు చేసుకుంది. ఒక రకంగా సీనియర్ హీరోలకి కూడా ఈ హీరోయిన్ తగిన జోడి అంటూ ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది.
అయితే తాజాగా కేరళలోని ఓ షోరూం ఓపెనింగ్కి హనీరోజ్ గెస్టుగా వెళ్లింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేశారు. దీంతో ఇదంతా చూసి బౌన్సర్లు, పోలీసులే షాక్ అయ్యారు. అంతమంది జనాన్ని కంట్రోల్ చేయలేక నానా తిప్పలు పడ్డారు.
ఇక షాప్ ఓపెనింగ్ అనంతరం హనీరోజ్ తిరిగి వెళ్తుండగా ఆమెతో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఇంకొంత మంది అయితే ఆమెపై పడిపోయారు కూడా. చివరికి ఎలాగోలా హనీరోజ్ కారెక్కి వెళ్లిపోయింది.
ఇదంతా చూస్తే హాని రోజ్ కు ఉన్న ఫాలోయింగ్ తక్కువేమీ కాదు అని అర్థమవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా హనీనే తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా వీడియో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హనీరోజ్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
కాగా, 2008 లో శివాజీ హీరోగా నటించిన ఆలయం సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మాలీవుడ్ భామ హనీ రోజ్. ఆ తరువాత వరుణ్ సందేశ్ ఈ వర్షం సాక్షిగా సినిమాలో కూడా కనిపించింది. కానీ ఈ చిత్రాలు ఏవి ఆమెను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయలేదు. వీరసింహారెడ్డి సినిమాతో ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకునింది హనీ రోజ్. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. సెకండ్ హాఫ్ లో మాత్రం తన అందంతో అందరిని కట్టి పడేసింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ మరో హీరోయిన్ గా నటించింది. బాలకృష్ణ డబుల్ రోల్ చేసిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
నిజానికి మలయాళం లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ .. ఇప్పుడు వీరా క్రేజ్ తో తెలుగులో కూడా వరుస ఆఫర్లు రావడం ఖాయం అని రుజువు చేసుకుంది. ఒక రకంగా సీనియర్ హీరోలకి కూడా ఈ హీరోయిన్ తగిన జోడి అంటూ ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది.
అయితే తాజాగా కేరళలోని ఓ షోరూం ఓపెనింగ్కి హనీరోజ్ గెస్టుగా వెళ్లింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేశారు. దీంతో ఇదంతా చూసి బౌన్సర్లు, పోలీసులే షాక్ అయ్యారు. అంతమంది జనాన్ని కంట్రోల్ చేయలేక నానా తిప్పలు పడ్డారు.
ఇక షాప్ ఓపెనింగ్ అనంతరం హనీరోజ్ తిరిగి వెళ్తుండగా ఆమెతో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఇంకొంత మంది అయితే ఆమెపై పడిపోయారు కూడా. చివరికి ఎలాగోలా హనీరోజ్ కారెక్కి వెళ్లిపోయింది.
ఇదంతా చూస్తే హాని రోజ్ కు ఉన్న ఫాలోయింగ్ తక్కువేమీ కాదు అని అర్థమవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా హనీనే తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా వీడియో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హనీరోజ్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
కాగా, 2008 లో శివాజీ హీరోగా నటించిన ఆలయం సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మాలీవుడ్ భామ హనీ రోజ్. ఆ తరువాత వరుణ్ సందేశ్ ఈ వర్షం సాక్షిగా సినిమాలో కూడా కనిపించింది. కానీ ఈ చిత్రాలు ఏవి ఆమెను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయలేదు. వీరసింహారెడ్డి సినిమాతో ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకునింది హనీ రోజ్. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. సెకండ్ హాఫ్ లో మాత్రం తన అందంతో అందరిని కట్టి పడేసింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ మరో హీరోయిన్ గా నటించింది. బాలకృష్ణ డబుల్ రోల్ చేసిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.