Begin typing your search above and press return to search.

గోద్రా టీజర్… తెరపైకి మరో సంఘటన

By:  Tupaki Desk   |   30 May 2023 4:48 PM GMT
గోద్రా టీజర్… తెరపైకి మరో సంఘటన
X
ఈ మధ్యాకాలంలో రియల్ లైఫ్ సంఘటనలు బేస్డ్ గా మూవీస్ వస్తోన్న సంగతి తెలిసిందే. హిందీలో వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ ఎంత సంచలనంగా మారిందో అంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కాశ్మీర్ లోని హిందూ పండిట్స్ ని లక్ష్యంగా చేసుకొని సాగించిన మారణహోమం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఈ చిత్రాన్ని వ్యతిరేకించిన వర్గాలు ఉన్నాయి.

ఇక రీసెంట్ గా ది కేరళ స్టొరీ అనే మూవీ కూడా అత్యంత వివాదాస్పదమైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 250 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇంకా ఈ మూవీ హవా కొనసాగుతూనే ఉంది. దీనిపై కూడా ముస్లిం మైనారిటీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. లవ్ జీహాద్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు హిందీలో మరో వివాదాస్పదమైన కథాంశంతో మూవీ సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన టీజర్ లాంచ్ అయ్యింది. 2002లో గోద్రా రైలు దగ్ధం ఘటన నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

అయోధ్యలో వెళ్తోన్న హిందూ పండిట్స్ అయిన కరసేవకులు లక్ష్యంగా ట్రైన్ చైన్ లాగి మూకుమ్మడిగా దాడి చేసి ఎస్6 బోగికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మొత్తం 59 మంది చనిపోయారు.

అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనని ఒక ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. గోద్రా ఘటన సమయంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఘటన తర్వాత గుజరాత్ లో అల్లర్లు చెలరేకి సుమారు 2000 మంది వరకు చనిపోయారు. ఈ గోద్రా రైలు దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందని తరువాత ఒక ఎంక్వయిరీ కమిషన్ ఆధారాలు బయట పెట్టింది.

ఇప్పుడు అదే ఘటన మీద గోద్రా టైటిల్ తో హిందీలో సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాను బీజే పురోహిత్, రామ్ కుమార్ పాల్ నిర్మించగా. ఎం.కే. శివాక్ష్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు కాని మరోసారి దేశవ్యాప్తంగా చర్చకి దారితీసేలా మాత్రం ఉంది. ఏది ఏమైనా గోద్రా టీజర్ ఇప్పుడు సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉండటం విశేషం.