Begin typing your search above and press return to search.

మంచి క్రేజ్ లో ఉన్నా వెంకీ వాళ్ళను నమ్మట్లే!

By:  Tupaki Desk   |   30 Jan 2023 1:00 PM GMT
మంచి క్రేజ్ లో ఉన్నా వెంకీ వాళ్ళను నమ్మట్లే!
X
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం శైలేంద్ర కొలను దర్శకత్వంలో సైంధవ అనే సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సురేష్ ప్రొడక్షన్ ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దీఖ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుతెలుస్తుంది.

ఫిబ్రవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కంటే ముందు ఇద్దరు యంగ్ టాలెంటెడ్ దర్శకులు చాలా కాలంగా వెంకటేష్ తో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నారు. వారిలో తరుణ్ భాస్కర్ ఒకరు. తరుణ్ భాస్కర్ చివరిగా ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చేశారు. రీసెంట్ గా కొత్తవాళ్ల తో కీడాకోలా అనే సినిమా స్టార్ట్ చేశాడు.

లోబడ్జెట్ మూవీగానే ఈ సినిమా కూడా తెరకెక్కుతుంది. అయితే విక్టరీ వెంకటేష్ తో సినిమా కోసం కథ సిద్ధం చేసుకొని చాలా కాలం నుంచి తరుణ్ భాస్కర్ వెయిట్ చేస్తున్నాడు. అయితే తరుణ్ చెప్పిన స్క్రిప్ట్ వెంకటేష్ కి నచ్చకపోవడం రిజక్ట్ చేసినట్లు తెలుస్తుంది. రెండు, మూడు వెర్షన్స్ విన్నతర్వాత కూడా కనెక్ట్ కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పూర్తిగా పక్కన పెట్టినట్లుతెలుస్తుంది.

ఇక జాతిరత్నాలు, ప్రిన్స్ సినిమాలతో సత్తా చాటిన కెవి అనుదీప్ తనదైన శైలి కాన్సెప్ట్ తో వెంకటేష్ ని మెప్పించే ప్రయత్నం చేశారు. సురేష్ బాబు అతనిని పిలిచి మంచి స్క్రిప్ట్ సిద్ధం చేయమని టైం ఇచ్చిన కూడా వెంకటేష్ కి నచ్చే కథ సెట్ కాకపోవడం ఆ ప్రాజెక్ట్ ని కూడా క్యాన్సిల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఈ నేపధ్యంలో తరుణ్ భాస్కర్, అనుదీప్ ప్రాజెక్ట్స్ కాదనుకొని ఇప్పుడు శైలేంద్ర చెప్పిన కాప్ స్టొరీ నచ్చడంతో వెంటనే స్టార్ట్ చేసింట్లు తెలుస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.