Begin typing your search above and press return to search.

పోస్ట‌ర్ల‌తో గుబులు రేపుతున్న ఏక్ విల‌న్

By:  Tupaki Desk   |   30 Jun 2022 1:30 PM GMT
పోస్ట‌ర్ల‌తో గుబులు రేపుతున్న ఏక్ విల‌న్
X
పోస్ట‌ర్ల‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారితే ఆ సినిమాకి బ‌జ్ పెరిగేందుకు ఛాన్సుంది. ప్ర‌చారంతోనే హైప్..! ప్ర‌స్తుతం ఏక్ విల‌న్ రిట‌ర్న్స్ టీమ్ దీనిని అనుస‌రిస్తోంది. కొత్త‌ పోస్ట‌ర్ల‌తో స‌ద‌రు టీమ్ వెబ్ పై విరుచుకుప‌డింది. ఏక్ విలన్ రిటర్న్స్ తాజా పోస్టర్లలో జాన్ అబ్రహం- దిశా పటానీ.. అర్జున్ కపూర్- తారా సుతారియా జంట‌లు వేడెక్కించే లుక్ తో క‌నిపించారు. తాజా మోనోక్రోమ్ పోస్టర్ లలో హాటెస్ట్ పెయిర్స్ ట్రీట్ కి యువ‌త‌రం ఫిదా అయిపోతోంది.

ఏక్ విల‌న్ 2 ట్రైలర్ ఈరోజు (జూన్ 30న) విడుదలకు సిద్ధ‌మైంది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా - శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలలో 2014 జూన్ 27న విడుదలైన ఏక్ విలన్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

తాజాగా సీక్వెల్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇంత‌లోనే ప్ర‌చారంలో భాగంగా మేకర్స్ ఈ చిత్రం నుండి నటీనటుల కొత్త పోస్టర్ లను విడుదల చేశారు. ఒక పోస్టర్ లో అర్జున్ కపూర్ -తారా సుతారియా బైక్ పై డీప్ హ‌గ్ తో క‌నిపించ‌గా.. బ్లాక్ అండ్ వైట్ థీమ్ లుక్ తో క‌నిపించారు.

దిశా -జాన్ అబ్రహం మరొక పోస్టర్ లో టోన్డ్ ఫిజిక్ ను ప్రదర్శించారు. ట్రైలర్ విడుదలకు ఒక రోజు ముందు బజ్ క్రియేట్ చేయడానికి టీమ్ పోస్టర్ ల ను విడుద‌ల చేసింది.

ఏకే విలన్ రిటర్న్స్ గురించి

హీరో - విలన్ మధ్య సంఘర్షణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఏక్ విల‌న్ కి కొన‌సాగింపు క‌థ‌తో ఈ సీక్వెల్ తెర‌కెక్కుతోంది. ఏక్ విలన్ రిటర్న్స్ ఇద్దరు విలన్ ల కథను రివీల్ చేస్తుంది. ఇందులో జాన్ అబ్రహం .. అర్జున్ కపూర్ ప్రతినాయ‌కులుగా క‌నిపిస్తారు. థ్రిల్లర్ క‌థ‌నంతో తెరకెక్కిన ఈ చిత్రంలో తారా సుతారియా.. దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. మోహిత్ తో జాన్ అబ్రహం తొలిసారి ప‌ని చేస్తుండ‌గా దిశాకు రెండో అవ‌కాశం ద‌క్కింది. మోహిత్ దర్శకత్వం వహించిన 'మలంగ్- లైవ్ టీవీ'లో దిశా పటానీ ప్రధాన పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ట్రైల‌ర్ తో మెప్పిస్తే బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యానికి ఆస్కారం ఉంటుంది. ఏక్ విల‌న్ 2 ట్రైల‌ర్ కోసం జాన్ భాయ్ అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.