Begin typing your search above and press return to search.

సర్కారు వారి దుబాయ్ సీన్ స్పెషాలిటీ

By:  Tupaki Desk   |   18 Jan 2022 3:33 PM GMT
సర్కారు వారి దుబాయ్ సీన్ స్పెషాలిటీ
X
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చి రెండేళ్లు పూర్తి అయ్యింది. 2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చిన సమయంలోనే మహేష్ బాబు తన తదుపరి సినిమాను పరశురామ్‌ దర్శకత్వంలో అంటూ ప్రకటించాడు. గీత గోవిందం వంటి సూపర్‌ హిట్‌ సినిమాను చేసిన దర్శకుడు పరశురామ్‌ తో సినిమా అనగానే ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అంటూ అభిమానులు మరియు ఇతర ఇండస్ట్రీ వర్గాల వారు అంతా భావించారు. సర్కారు వారి పాట అనే టైటిల్‌ ను ఖరారు చేసి కూడా చాలా కాలం అయ్యింది. మహేష్ బాబు ఈ సినిమా ను అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు గత ఏడాది ఆరంభంలో షూటింగ్‌ ప్రారంభం అవ్వగా ఈ ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని భావించారు. కాని కరోనా మళ్లీ సర్కారు వారి పాట విడుదల వాయిదా పడేలా చేసింది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల కూడా అవ్వాల్సిన సర్కారు వారి పాటకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

సర్కారు వారి పాట చిత్రీకరణ దుబాయ్ లో మొదలు పెట్టారు. అక్కడ కీలకమైన యాక్షన్‌ సీక్వెన్స్ తో పాటు సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలను అక్కడ షూట్‌ చేయడం జరిగింది. ఇప్పుడు సినిమాలోని దుబాయ్ యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రముఖంగా మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. దుబాయి లో చిత్రీకరించిన ఆ ఫైట్‌ సన్నివేశం కోసం హాలీవుడ్‌ ప్రముఖ స్టంట్ మాస్టర్స్ మరియు టెక్నీషియన్స్ వర్క్‌ చేశారట. దాంతో ఆ ఫైట్ సినిమాకు ఖచ్చితంగా స్పెషల్‌ గా ఉంటుందని అంటున్నారు. ఆ ఫైట్‌ చాలా స్పెషాలిటీలను కలిగి ఉంటాయని అంటున్నారు. మహేష్ బాబు విదేశీ ఫైటర్స్ తో తలపడబోతున్నాడని.. అలాగే ఆ ఫైట్‌ మొత్తం కూడా ఒక బీచ్ లో అత్యంత కఠిన పరిస్థితుల్లో షూట్‌ చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ సినిమా లో మహేష్ బాబు కు జోడీగా కీర్తి సురేష్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఆమె ఇప్పటికే మహేష్ బాబుతో కలిసి నటించింది. మరో షెడ్యూల్‌ తో ఆమె షూటింగ్‌ పార్ట్‌ మొత్తం పూర్తి అవుతుందని అంటున్నారు. అతి త్వరలోనే తుది షెడ్యూల్‌ ను ప్రారంభించి సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాను ఏప్రిల్‌ 1 ను విడుదల చేయాలని సర్కారు వారి పాట టీమ్‌ ప్లాన్ చేసిందట. కాని సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యే పరిస్థితి లేకపోవడం వల్లో లేదా మరేంటో కాని ఏప్రిల్‌ 1వ తారీకును ఆచార్య సినిమాకు వదిలేశారు. మరి సర్కారు వారి పాట సినిమా ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. ఈ సినిమా తర్వాత మహేష్‌ బాబు త్రివిక్రమ్‌ సినిమా ను ఆ తర్వాత రాజమౌళి సినిమా లను చేయాల్సి ఉంది.