Begin typing your search above and press return to search.

నరేశ్ ముగ్గురు భార్యల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

By:  Tupaki Desk   |   6 July 2022 2:30 AM GMT
నరేశ్ ముగ్గురు భార్యల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?
X
సీనియర్ నటుడు నరేష్ - పవిత్ర లోకేష్ వ్యవహారం గత కొన్ని రోజులుగా తెలుగు కన్నడ మీడియాలలో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నరేష్ తన సహ నటి పవిత్రతో సహజీవనం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. ఇప్పుడు పవిత్రతో నాలుగో వివాహానికి రెడీ అయ్యారని పుకార్లు షికారు చేశాయి. అయితే తాను ఇంకా విడాకులు ఇవ్వలేదంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి రంగంలోకి దిగడంతో రచ్చబండ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో నరేష్ గతంలో వివాహం చేసుకున్న వారు వార్తల్లో నిలిచారు.

విజయనిర్మల మొదటి భర్తకు కలిగిన సంతానం నరేష్. తల్లి బాటలో ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముందుగా సీనియర్ డ్యాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెను నరేశ్ పెళ్లి చేసుకున్నారు. వీరికి నవీన్ విజయ్ కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. నవీన్ హీరోగా 'నందిని నర్సింగ్ హోమ్' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

మొదటి భార్యతో చట్టబద్ధంగా విడిపోయిన నరేశ్.. ఆ తర్వాత ప్రముఖ కవి, సినీ గీత రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. అయితే కొన్నాళ్ల దాంపత్య జీవితం గడిపిన తరువాత వీరు విడిపోయారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ.. వీరిద్దరూ కలిసి ఇప్పటికీ ఓ ఎన్జీవో కోసం పనిచేస్తున్నట్లు టాక్.

ఇక 50 ఏళ్ళు దాటిన తర్వాత ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు నరేష్. తనకంటే చాలా ఏళ్ళు చిన్నదైన రమ్య రఘుపతి ని వివాహం చేసుకున్నాడు. ఆంధప్రదేశ్ మాజీ ఏఐసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె ఈ రమ్య. నీలకంఠ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన ఆమె.. ఆ తర్వాత నరేష్ తల్లి విజయ నిర్మల దగ్గర కో డైరెక్టర్ గా కూడా వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నరేష్ తో రమ్యకు ఏర్పడిన పరిచయం పెళ్లి దాకా దారితీసింది. యాభై ఏళ్ళ వయసులో తనకన్నా చాలా తక్కువ వయసున్న యువతిని పెళ్లి చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

నరేష్ - రమ్య దంపతులకు కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండు మూడేళ్లు కలిసి కాపురం చేసిన వీరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో గత ఎనిమిదేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. అయితే తన కొడుకు మెయింటనెన్స్ కోసం నరేష్ కొంత మొత్తం పంపిస్తూ ఉంటారని టాక్. ఈ క్రమంలో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు పవిత్ర లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రమ్య రఘుపతి మీడియాలో మాట్లాడుతూ.. నరేష్ తో తన వైవాహిక బంధం ఇంకా తెగిపోలేదని.. తాను విడాకుల పేపర్లపై సంతకం చేయలేదని తెలిపింది. ఇప్పటికీ తాను నరేష్ భార్యనే అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. నరేష్ మాత్రం ఆమె తనకు భార్యలా ఏనాడూ ప్రవర్తించలేదని అంటున్నారు.

బాబు పుట్టిన ఏడాది తర్వాత రమ్య క్యారక్టర్ బయటపడిందని.. ఆమె తన డ్రైవర్ తో ఎఫైర్ పెట్టుకుందని నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక పవిత్ర ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. రమ్య కావాలనే తమను బ్యాడ్ చేయడానికి ఇలా చేస్తోందని.. తనకు నరేశ్ కు అభిమానుల సపోర్ట్ కావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో నరేష్ - పవిత్ర మైసూరులోని ఓ హోటల్ లో ఉండగా.. రమ్య అక్కడి వెళ్లి వారితో గొడవకు దిగింది. పవిత్ర పై దాడి చేసేందుకు యత్నించింది. మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.