Begin typing your search above and press return to search.
#దిశా ఎన్ కౌంటర్.. కోర్టు గొడవలు తేలేదెపుడు?
By: Tupaki Desk | 25 Nov 2020 4:00 PM GMTవివాదం లేనిదే ఆర్జీవీ లేరు. వివాదంతో ప్రచారం అనేది తన పంథా. గిల్లి కజ్జాలు గొడవలతోనే బోలెడంత ప్రచారం చేసుకుంటారు. ఈ దారిని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టరు. స్వతహాగా మొండివాడైన వర్మ ఎంచుకునే కాన్సెప్టులోనే వివాదం ఉండేలా జాగ్రత్త పడతారు.
ఇప్పటికిప్పుడు సెట్స్ పై ఉన్న సినిమాలన్నిటిపైనా వివాదాలున్నాయి. ఇవి ఎప్పటికి రిలీజవుతాయి? అన్నది ఆర్జీవీకి అయినా అంతగా స్పష్ఠత లేనేలేదేమో! అంతగా వివాదాలు ముసురుకున్నాయి. కోర్టు గొడవలతోనే బోలెడంత కాలయాపన తప్పేట్టు లేదు.
దిశా ఎన్ కౌంటర్ పై సినిమా వాస్తవానికి నవంబర్ 26 న OTT ప్లాట్ ఫామ్ లో విడుదల కావాల్సింది. అయితే ఈ చిత్రం విడుదలపై అనిశ్చితి నెలకొంది . RGV సినిమాపై పెండింగ్ లో ఉన్న కేసులు ఇంకా ఎన్నో. కొన్ని వారాల క్రితం దిషా తండ్రి హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు దిశా ఎన్ కౌంటర్ పై సినిమాని నిషేధించాలని డిమాండ్ చేశారు. తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆ హత్య చేసిన అనంతరం ఎన్ కౌంటర్ కి గురైన నేరస్థుల కుటుంబ సభ్యులు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ విషాద సంఘటన నుండి వారు ఇప్పటికే తమ గ్రామంలో చాలా అవమానాలను ఎదుర్కొంటున్నామని .. దిశా ఎన్ కౌంటర్ విడుదల చేస్తే వారిని గ్రామంలో నివసించడానికి అనుమతించరని వారు ఆరోపించారు. దీనికి సంబంధించి ఆర్జివికి కోర్టు నోటీసు జారీ చేసి.. తదుపరి విచారణ కోసం ఎదురుచూస్తోంది. ఈ సమస్యల దృష్ట్యా దిశా ఎన్ కౌంటర్ మూవీ రిలీజవ్వడం అంత సులువేమీ కాదేమో!
ఇప్పటికిప్పుడు సెట్స్ పై ఉన్న సినిమాలన్నిటిపైనా వివాదాలున్నాయి. ఇవి ఎప్పటికి రిలీజవుతాయి? అన్నది ఆర్జీవీకి అయినా అంతగా స్పష్ఠత లేనేలేదేమో! అంతగా వివాదాలు ముసురుకున్నాయి. కోర్టు గొడవలతోనే బోలెడంత కాలయాపన తప్పేట్టు లేదు.
దిశా ఎన్ కౌంటర్ పై సినిమా వాస్తవానికి నవంబర్ 26 న OTT ప్లాట్ ఫామ్ లో విడుదల కావాల్సింది. అయితే ఈ చిత్రం విడుదలపై అనిశ్చితి నెలకొంది . RGV సినిమాపై పెండింగ్ లో ఉన్న కేసులు ఇంకా ఎన్నో. కొన్ని వారాల క్రితం దిషా తండ్రి హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు దిశా ఎన్ కౌంటర్ పై సినిమాని నిషేధించాలని డిమాండ్ చేశారు. తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆ హత్య చేసిన అనంతరం ఎన్ కౌంటర్ కి గురైన నేరస్థుల కుటుంబ సభ్యులు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ విషాద సంఘటన నుండి వారు ఇప్పటికే తమ గ్రామంలో చాలా అవమానాలను ఎదుర్కొంటున్నామని .. దిశా ఎన్ కౌంటర్ విడుదల చేస్తే వారిని గ్రామంలో నివసించడానికి అనుమతించరని వారు ఆరోపించారు. దీనికి సంబంధించి ఆర్జివికి కోర్టు నోటీసు జారీ చేసి.. తదుపరి విచారణ కోసం ఎదురుచూస్తోంది. ఈ సమస్యల దృష్ట్యా దిశా ఎన్ కౌంటర్ మూవీ రిలీజవ్వడం అంత సులువేమీ కాదేమో!