Begin typing your search above and press return to search.

మళ్లీ చర్చల్లో కృష్ణవంశీ 'రైతు'..!

By:  Tupaki Desk   |   21 March 2023 6:00 PM GMT
మళ్లీ చర్చల్లో కృష్ణవంశీ రైతు..!
X
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఉగాది కానుకగా తను తీసిన రంగమార్తాండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. మరాఠిలో నానా పటేకర్ నటించిన నట సామ్రాట్ కి రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. అక్కడ నానా పటేకర్ చేసిన పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అలి రెజా ఇలా చాలామంది నటీనటులు సినిమాలో ఉన్నారు. సినిమాకు ప్రమోషన్స్ ఏమి లేవని అనుకుంటున్న టైం లోనే ఈరోజు చిత్ర యూనిట్ మొత్తం ప్రెస్ మీట్ పెట్టి ఆడియన్స్ కి సినిమాపై ఆసక్తి కలిగేలా చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ తన నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కృష్ణ వంశీ అన్నం, రైతు రెండు సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నారు. రైతు సినిమాను బాలకృష్ణ హీరోగా చేయాలని అనుకున్నారు. బాలయ్య బాబు ఓకే చెప్పినా సినిమాలో అమితాబ్ బచ్చన్ నటిస్తేనే తాను ఈ సినిమా చేస్తానని అన్నారు. దానితో అమితాబ్ ని కృష్ణ వంశీ మెప్పించకపోవడంతో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. అయితే రంగమార్తాండతో మళ్లీ ఫాంలోకి వచ్చిన కృష్ణ వంశీ రైతు సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

రంగమార్తాండ నిర్మాత మధునే రైతు సినిమాను నిర్మిస్తారని తెలుస్తోంది. బాలకృష్ణతో తీయాలనుకున్న రైతు సినిమా ఇప్పుడు వేరే నటీనటులతో తీయాలని ఫిక్స్ అయ్యాడట కృష్ణ వంశీ. రైతు సినిమా తప్పకుండా కృష్ణ వంశీ మార్కు మూవీగా ఉంటుందని ఆ కథ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. బాలకృష్ణ సినిమా చేయాలంటే అమితాబ్ తో ముడి పెట్టాడు. అందుకే కృష్ణ వంశీ ఈ సినిమాను మరో హీరోతో చేయాలని అనుకుంటున్నారట.

బాలకృష్ణ కోసం అనుకున్న కథ మరో హీరోతో చేయాలంటే కథనం చాలా మార్చాల్సి ఉంటుంది. మరి కృష్ణ వంశీ రైతు ఎవరితో చేస్తారు.. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది త్వరలో తెలుస్తుంది. రైతు తో పాటుగా అన్నం సినిమాను కూడా కృష్ణవంశీ నెక్స్ట్ ప్లానింగ్ లో ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.