Begin typing your search above and press return to search.

ఒక్క మాటలో ప్రభాస్ ని వర్ణించలేం..!

By:  Tupaki Desk   |   5 Dec 2021 4:30 AM GMT
ఒక్క మాటలో ప్రభాస్ ని వర్ణించలేం..!
X
'జిల్' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన రాధాకృష్ణ కుమార్.. తొలి చిత్రంతోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలో వీరి కాంబోలో ''రాధే శ్యామ్'' అనే వింటేజ్ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాని 2022 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో దర్శకుడు రాధా కృష్ణ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వస్తోన్న ''రాధే శ్యామ్'' గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. పూజా హెగ్డే గురించి ఓ అభిమాని అడగ్గా.. ప్రేరణ పాత్ర కోసం తాను ఎప్పుడూ పూజా హెగ్డేని మాత్రమే దృష్టిలో ఉంచుకుంటానని తెలిపారు.

''ఆ పాత్రకు మరో నటి సూట్ అవ్వదు. పూజా ఎప్పుడూ నా ఫస్ట్ ఛాయిస్. రాధేశ్యామ్ చూసిన తర్వాత అది మీకు కూడా తెలుస్తుంది'' అని రాధా కృష్ణ చెప్పారు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి ఒక్క మాట చెప్పమని మరో అభిమాని దర్శకుడిని అడిగాడు. ఒక్క మాటలో ప్రభాస్ ని వర్ణించలేమని.. అది ఎప్పటికీ సరిపోదని రాధా కృష్ణ అభిప్రాయ పడ్డారు.

ప్రభాస్ తో వర్క్స్ చేసిన నటీనటులు సాంకేతిక నిపుణులు డార్లింగ్ మనసు ఎలాంటిదో చెబుతూ ఉంటారు. ఇటీవల 'ఆది పురుష్' డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ వ్యక్తిత్వం ఎలాంటిదో వివరించారు. ఇప్పుడు 'రాధే శ్యామ్' దర్శకుడు కూడా అతని గురించి ఒక్క మాటలో చెప్పడం అసాధ్యమని చెప్పడంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఇంకా 'రాధే శ్యామ్' గురించి ఓ సందేహాన్ని వ్యక్తం చేసిన నెటిజన్.. ఇందులో మరేదైనా ప్లాన్ చేస్తున్నారా? అని దర్శకుడిని ప్రశ్నించారు. "మీరు మీ హృదయంలో ఏదైనా గట్టిగా కోరుకున్నప్పుడు, అది జరిగేలా విశ్వమంతా నీతో కలిసి వస్తుంది" అంటారుగా.. ఇది కూడా అందులో భాగమని నేను భావిస్తున్నాను. మిమ్మల్ని సంతోషపెట్టడానికి మేము పని చేస్తున్నాము. అంతకంటే ఇంకేమీ లేదు అని రాధాకృష్ణ సమాధానమిచ్చారు.

కాగా, 'రాధే శ్యామ్' లో విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ప్రేరణగా పుజా సందడి చేయనున్నారు. ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరిందని ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చూస్తే అర్థం అవుతుంది. 'ఈ రాతలే' 'నగుమోము తారలే' పాటలు అత్యధిక వ్యూస్‌ తో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి.

కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - ప్రసీద నిర్మాతలు. హిందీలో టీ సిరీస్ భూషణ్ కుమార్ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో హిందీ మరియు తెలుగులో ఏకకాలంలో 'రాధే శ్యామ్' సినిమా రూపొందుతోంది. ప్రధాన భారతీయ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.