Begin typing your search above and press return to search.

ఇద్దరు తమిళ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేస్తున్న దిల్ రాజు..!

By:  Tupaki Desk   |   15 Jun 2021 8:30 AM GMT
ఇద్దరు తమిళ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేస్తున్న దిల్ రాజు..!
X
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇన్నాళ్లూ తెలుగు సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ - కోలీవుడ్ లపై ఫోకస్ పెట్టిన దిల్ రాజు.. పాన్ ఇండియా సినిమాలు - పాన్ సౌత్ ప్రాజెక్ట్స్ - హిందీ చిత్రాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో తమిళ అగ్ర దర్శకులు - తెలుగు స్టార్ హీరోలు.. కోలీవుడ్ స్టార్ హీరోలు - టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కాంబినేషన్లో సినిమాలు సెట్ చేస్తున్నారు.

ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ - శంకర్‌ కాంబినేషన్‌ లో ఓ పాన్‌ ఇండియా మూవీని అనౌన్స్ చేశారు దిల్ రాజు. ఈ క్రమంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ - 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో ఓ పాన్ సౌత్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాతో విజయ్ టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక మరో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కార్యరూపం దాల్చలేదు.

అయితే తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సూర్య తో ఓ ద్విభాషా చిత్రం చేయడానికి దిల్ రాజు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సూర్య సరైన కథ దొరకపోవడంతో ఇన్నాళ్లు తెలుగు సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు బోయపాటి చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం 'అఖండ' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న బోయపాటి.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇదే క్రమంలో ఇప్పుడు దిల్ రాజ్ బ్యానర్ లో సూర్య తో ఓ ప్రాజెక్ట్ కమిటైనట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే బన్నీ సినిమా కంటే ముందే సూర్యతో మూవీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ 'పుష్ప 1' తర్వాత 'ఐకాన్' 'పుష్ప 2' సినిమాలు చేయాల్సి ఉంది. దాని తర్వాతే బోయపాటి సినిమా ఉంటుంది. అందుకే ఆ లోపు సూర్య - బోయపాటి కాంబోలో మూవీ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా ఇద్దరు తమిళ స్టార్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసే బాధ్యతను దిల్ రాజు తీసుకున్నారని చెప్పవచ్చు.