Begin typing your search above and press return to search.
బయోపిక్ మీద పడిన విక్రమ్ తనయుడు!
By: Tupaki Desk | 31 May 2023 6:00 PM GMTచియాన్ విక్రమ్ వారసుడి గా ఎంట్రీ ఇచ్చిన ధృవ్ ఏం చేస్తున్నట్లు? 2022 తర్వాత యంగ్ హీరో నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు? కొత్త సినిమా ఏదైనా కమిట్ అయ్యాడా? లేక! మళ్లీ డాడ్ చిత్రంలో కనిపించ బోతున్నాడా? వంటి సందేహాలు మళ్లీ తెర పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా ధృవ్ కనిపించకపోయేసరికి ఏమై పోయాడంటూ! టాలీవుడ్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. అయితే సైలెంట్ గా ఇలా ట్విస్ట్ ఇస్తాడని ఊహించి ఉండరు.
అవును ధృవ్ ఆకలి తో ఉన్న సింహంలా పెద్ద వేటకే సిద్దమైనట్లు తెలుస్తోంది. ఏకంగా బయోపిక్ స్టోరీనే టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. కబడ్డీ ప్లేయర్..అర్జున్ అవార్డు గ్రహీత మానతీ గణేషన్ జీవితం ఆధారంగా స్టార్ డైరెక్టర్ సెల్వరాజ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
ఇందులో మానతీ గణేషన్ పాత్రకి ధృవ్ ని ఎంపిక చేసారు. గత కొన్ని నెలలు గా ధృవ్ ఆ పాత్రకి సంబంధించి శిక్షణలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. నిష్ణాతుల సమక్షంలో ధృవ్ కబడ్డీ లో తర్పీదు పొందుతున్నాడు. శరీరాకృతి లో భారీ మార్పులే చేస్తున్నట్లు తెలుస్తుంది.
అవసర మైన వర్కౌట్లు చేస్తూ కొన్ని నెలలుగా బిజీగానే గడుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ధృవ్ ఆలస్యమైన పెద్ద ప్రాజెక్ట్ పట్టాడు. కెరీర్ ఆరంభంలోనే బయోపిక్ లో నటించే అరుదైన ఛాన్స్ అందుకు న్నాడు. బయోపిక్ లకు బాలీవుడ్ కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ సౌత్ కి అలవాటవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అన్ని పనులు పూర్తి చేసి ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. 'దగ్గరబంధువైన మనతి గణేశన్ జీవితాన్ని సినిమాగా తీయాలని ఉండేది. ఇప్పుడా కోరిక నెరవేరుతుంద'న్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ నిర్మిస్తుండటం విశేషం.
అవును ధృవ్ ఆకలి తో ఉన్న సింహంలా పెద్ద వేటకే సిద్దమైనట్లు తెలుస్తోంది. ఏకంగా బయోపిక్ స్టోరీనే టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. కబడ్డీ ప్లేయర్..అర్జున్ అవార్డు గ్రహీత మానతీ గణేషన్ జీవితం ఆధారంగా స్టార్ డైరెక్టర్ సెల్వరాజ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
ఇందులో మానతీ గణేషన్ పాత్రకి ధృవ్ ని ఎంపిక చేసారు. గత కొన్ని నెలలు గా ధృవ్ ఆ పాత్రకి సంబంధించి శిక్షణలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. నిష్ణాతుల సమక్షంలో ధృవ్ కబడ్డీ లో తర్పీదు పొందుతున్నాడు. శరీరాకృతి లో భారీ మార్పులే చేస్తున్నట్లు తెలుస్తుంది.
అవసర మైన వర్కౌట్లు చేస్తూ కొన్ని నెలలుగా బిజీగానే గడుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ధృవ్ ఆలస్యమైన పెద్ద ప్రాజెక్ట్ పట్టాడు. కెరీర్ ఆరంభంలోనే బయోపిక్ లో నటించే అరుదైన ఛాన్స్ అందుకు న్నాడు. బయోపిక్ లకు బాలీవుడ్ కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ సౌత్ కి అలవాటవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అన్ని పనులు పూర్తి చేసి ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. 'దగ్గరబంధువైన మనతి గణేశన్ జీవితాన్ని సినిమాగా తీయాలని ఉండేది. ఇప్పుడా కోరిక నెరవేరుతుంద'న్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ నిర్మిస్తుండటం విశేషం.