Begin typing your search above and press return to search.

షూటింగ్ లో నటిని ఆవహించిన దెయ్యం

By:  Tupaki Desk   |   15 Jun 2020 1:30 PM GMT
షూటింగ్ లో నటిని ఆవహించిన దెయ్యం
X
ఇసుకేస్తే రాలనంత జనం ఉండే ప్రాంతం మహారాష్ట్ర రాజధాని ముంబై. రాత్రి, పగలుకు అక్కడ తేడా లేదు. 24 గంటలూ జన సందోహం ఉంటుంది. అలాంటి చోట కూడా అడుగుపెట్టేందుకు భయపడే ప్రాంతాలు ఉన్నాయంటే నమ్మగలరా? కానీ ఉన్నాయి.

‘ముఖేష్ మిల్స్’.ఈ పేరు వింటే చాలు అక్కడి ప్రజలు వణికిపోతారు. దెయ్యాలు ఇక్కడ తిరిగేవని పుకార్లు ఉన్నాయి. అక్కడికి వెళ్లడానికి ధైర్యం చేయరు. అయితే హర్రర్ గా ఉండే ఈ మిల్స్ మాత్రం సినీ దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటోంది. నిశ్శబ్ధంగా భయంకరంగా ఉండే ఇక్కడ షూటింగ్ లకు అనుకూలంగా ఉంటుంది. షూటింగ్ స్పాట్ గా ఇది మారిపోయింది.

అయితే క్రమేణా పరిస్థితి మారిపోయింది. షూటింగ్ యూనిట్ లో కొందరికీ వింతైన అరుపులు, ఆకారాలు కనిపించడం మొదలైంది. వారిని ఎవరో పిలుస్తున్నట్టు, చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంటికి వెళ్లాక కూడా నటీనటులు, సినిమా యూనిట్ ను ఆ భయం వెంటాడిందట..

ఓ రోజు సినిమా షూటింగ్ కని వెళ్లిన యూనిట్ కు షాక్ తగిలింది. అందులో నటిస్తున్న నటి వింతగా ప్రవర్తించింది. సినిమాలో నటిస్తున్నఓ నటి.. వెంటనే స్వరం మగాడిలా మార్చి కళ్లు పెద్దవి చేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని లేదంటే చస్తారని సినిమా టీమ్ కు హెచ్చరికలు చేసి సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో భయంతో సినిమా యూనిట్ అక్కడి నుంచి అన్ని సర్దుకొని వెళ్లిపోయింది. 2009లో జరిగిన ఈ ఘటన తరువాత ఎవ్వరూ అక్కడ షూటింగ్ కు వెళ్లలేదు.

ఇక్కడ ఇటీవల షూటింగ్ కు వచ్చిన సందర్భంలో ఓ బాలనటి కూడా దెయ్యం పట్టినట్టుగా వింతగా ప్రవర్తించిందట..మరో సినిమా యూనిట్ వెళ్లగా.. సేమ్ అలాగే ఓ నటి కూడా పిచ్చిపిచ్చి గా అరవడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఇక ఓ సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన హీరోయిన్ బిపాసబసుకు కూడా వింత శబ్ధాలు వినిపించాయట.. ఇలా ఈ ముకేష్ మిల్స్ లో దెయ్యం ఉందని అందరూ కన్ఫం చేశారు.

1870లో నిర్మించిన ఈ ముఖేష్ మిల్స్ టెక్స్ టైల్ పరిశ్రమ ఎంతో మందికి ఉపాధినిచ్చింది. 1982లో భారీ అగ్నిప్రమాదం జరిగి బుగ్గయ్యింది. అప్పటి నుంచి మూతపడే ఉంది. పలు బాలీవుడ్ హర్రర్, సినిమాలు, సీరియళ్లు ఇక్కడ తీయగా.. అందరికీ చేదు అనుభవం ఎదురవుతూనే ఉందట.. అక్కడ దెయ్యం రహస్యం ఇప్పటికీ మిస్టరీగా మిగిలి ఉంది.