Begin typing your search above and press return to search.

లాభాల్లో వాటా కావాలంటున్న క్రేజీ హీరో

By:  Tupaki Desk   |   19 Jan 2022 10:31 AM GMT
లాభాల్లో వాటా కావాలంటున్న క్రేజీ హీరో
X
టాలీవుడ్ క్రేజ్ పెరిగింది. మార్కెట్ స్టాయి కూడా పెర‌గ‌డంతో కొంత మంది డైరెక్ట‌ర్లు, హీరోలు రెమ్యున‌రేష‌న్ లు స్థానంలో లాభాల్లో వాటాలు అడుగుతున్నారు. భారీ స్థాయిలో తెలుగు సినిమా మార్కెట్ పెర‌గ‌డం, అంతే స్థాయిలో లాభాలు వ‌స్తుండ‌టంతో నిర్మాత‌లు, డైరెక్ట‌ర్ల‌కు, హీరోల‌కు పారితోషికాల స్థానంలో లాభాల్లో లాటాలు ఇవ్వ‌డానికి రెడీ అయిపోతున్నారు. ఈ ప‌ద్ద‌తికి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. `బాహుబ‌లి` నుంచి ఆయ‌న ఇదే పంథాను అనుస‌రిస్తున్నారు.

ఇప్ప‌డు ఆయ‌న‌ని సుకుమార్‌, బోయ‌పాటి శ్రీ‌ను, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఇదే జాబితాలోకి మ‌న రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా చేరిపోతున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌` మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయికి మించి ఈ మూవీ తెర‌కెక్కుతోంది. హాలీవుడ్ స్టార్ బాక్స‌ర్ మైక్ టైస‌న్ ఎంట్రీతో ఈ మూవీ క్రేజ్ భారీ గా పెరిగిపోయింది. దీంతో ఈ సినిమాలో న‌టిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ దాదాపుగా 20 కోట్లు పారితోషికం అందుకుంటున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

`లైగ‌ర్‌` మూవీని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ లోనే ఈ మూవీ అత్యంత భారీ బ‌డ్జెట్ తో , భారీ స్టార్ కాస్ట్ తో రూపొందుతోంది. ఈ మూవీతో విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. అన‌న్య పాండే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ ఆగ‌స్టు 25న ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు ఐదు భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత విజ‌య్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ డైరెక్ష‌న్ లో మ‌రో భారీ సినిమా చేయ‌బోతున్నాడు.

ఇప్ప‌టికే ఈ మూవీని ప్ర‌క‌టించారు కూడా. ఫాల్క‌న్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించ‌య‌బోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది. ఊహించ‌ని క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొంద‌నున్నఈ మూవీకి `ర్యాంపేజ్‌` అనే టైటిల్ ని మేక‌ర్స్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఆర్మీ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నార‌ని, ఈ మూవీకి విజ‌య్ దేవ‌ర‌కొండ పారితోషికం తీసుకోవ‌డం లేద‌ని, సినిమా లాభాల్లో వాటాని తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

సుకుమార్ కూడా లాభాల్లో వాటిని తీసుకోబోతుండ‌టంతో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా అదే ఫార్ములాని అనుస‌రిస్తున్నార‌ట‌. `లైగ‌ర్‌` త‌రువాత ఈ మూవీ వెంట‌నే సెట్స్ పైకి వెళ్ల నుంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల `పుష్ప‌`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న సుకుమార్ త్వ‌ర‌లో `పుష్ప` సీక్వెల్ ని ప్రారంభించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. దీని త‌రువాతే విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు.