Begin typing your search above and press return to search.

కృష్ణ‌..మ‌హేష్ ని ప‌రామ‌ర్శించిన చిరంజీవి!

By:  Tupaki Desk   |   29 Sep 2022 11:35 AM GMT
కృష్ణ‌..మ‌హేష్ ని ప‌రామ‌ర్శించిన చిరంజీవి!
X
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ.. మహేష్ ల‌ను స్వ‌యంగా కలిసి పరామర్శించారు. ఇద్ద‌రిలో చాలా స‌మ‌యాన్ని గ‌డిపారు. మ‌హేష్..కృష్ణ‌ల‌ని హ‌త్తుకుని ఓదార్చారు. మ‌హేష్ తో వ్య‌క్తిగ‌తంగా చాలాసేపు మాట్లాడారు. బుధ‌వారంకృష్ణ సతీమణి.. మహేష్ తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్రమంలో మరణ వార్తపై చిరు వెంట‌నే స్పందించారు. 'ఇందిరా దేవి మృతి తనను ఎంతో కలచి వేసిందని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. కృష్ణ.. మహేష్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ట్విటర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన 'గాడ్ ఫాద‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కార‌ణంగా ఇందిరా దేవి భౌతికా కాయ‌న్ని చూడ‌టానికి వెళ్ల‌లేక‌పోయారు.

ఈ క్రమంలో ఇవాళ ఆయన మహేష్ కుటుంబాన్ని స్వయంగా కలిసి శ్ర‌ద్ధాంజ‌లి తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట‌ వైరల్ అవుతోంది. కృష్ణ‌..మ‌హేష్ మ‌ధ్య‌లో చిరంజీవి కూర్చున్నారు.

ఇద్ద‌రితో మాట మంతి చేసిన అనంత‌రం చిరు అక్క‌డ నుంచి వెనుదిరిగారు. అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇందిరా దేవి చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. మహేశ్ బాబు.. కృష్ణలను పరామర్శించారు. ఇంకా ప‌లువురు సినీ..రాజ‌కీయ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ప‌రామ‌ర్శ‌కు విచ్చేస్తున్నారు.

ప్ర‌స్తుతం చిరంజీవి గాడ్ ఫాద‌ర్ రిలీజ్ హ‌డావుడిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న రిలీజ్ అవుతోన్న సినిమా కి సంబంధించి ప్ర‌చారం ప‌నుల్లో నిమ‌గ్న‌మైన‌ట్లు తెలుస్తోంది. నిన్న‌టి రోజున రాయ‌ల‌సీమ‌లో జ‌రిగిన ప్రీరిలీజ్ వెంట్ కి హాజ‌ర‌య్యారు. ఈ వారం రోజులు ఇంట‌ర్వ్యూలు...స్పెష‌ల్ చిట్ చాట్ ల‌తో మీడియాలో చిరు త‌రుచూ క‌నిపించ‌నున్నారు.

'ఆచార్య' ప్లాప్ తర్వాత మెగాస్టార్ న‌టించిన చిత్ర‌మిది. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తార‌ని మెగా అభిమానులు ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. అటు చిరు- బాబి ద‌ర్శ‌క‌త్వంలో 'వాల్తేరు వీర‌య్య‌'లో...మోహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో 'భోళా శంక‌ర్' సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రాల రిలీజ్ ల్ని వెంట వెంట‌నే ప్లాన్ చేస్తున్నారు.