Begin typing your search above and press return to search.
కార్తికేయలో కరోనా తెచ్చిన మార్పు..!
By: Tupaki Desk | 29 Sep 2020 5:45 AM GMTకరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలల పాటు సినిమా పరిశ్రమ స్థంభించి పోయింది. ఈమద్యే షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. మరికొన్ని సినిమాలు ప్రారంభంకు సిద్దం అవుతున్నాయి. లాక్ డౌన్ కు ముందు కన్ఫర్మ్ అయిన కార్తికేయ 2 మూవీ షూటింగ్ పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అన్ని పక్కాగా ప్లానింగ్ చేసుకుని సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలనుకున్నారు. అలాంటి సమయంలో కరోనా రాకతో మొత్తం తారు మారు అయ్యింది. కొందరు నటీనటులు కూడా డేట్స్ కుదరడం లేదు అంటూ తప్పుకుంటున్నారట.
మొదటగా ఈ సినిమాకు అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేయడం జరిగింది. కాని ఆమె ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి మరో సినిమా షూటింగ్ తో బిజీ అయ్యిందట. ఆ కారణంగా అనుపమ పరమేశ్వరన్ కార్తీకేయ 2 నుండి తప్పుకుంటున్నట్లుగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె తప్పుకోవడంతో నానితో గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన ప్రియాంక అరుల్ ను ఎంపిక చేసే యోచనలో యూనిట్ సభ్యులు ఉన్నారని కూడా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయిన కారణంగా సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా మరో థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు చందు మొండేటి రూపొందించేందుకు స్ర్కిప్ట్ వర్క్ చేశాడు. ఈ లాక్ డౌన్ సమయంలో మరింతగా స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దినట్లుగా యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాను స్పీడ్ గా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సక్సెస్ ఫార్ములా అవ్వడంతో దర్శకుడు చందు మరియు హీరో నిఖిల్ లు ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకుని ఉన్నారు.
మొదటగా ఈ సినిమాకు అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేయడం జరిగింది. కాని ఆమె ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి మరో సినిమా షూటింగ్ తో బిజీ అయ్యిందట. ఆ కారణంగా అనుపమ పరమేశ్వరన్ కార్తీకేయ 2 నుండి తప్పుకుంటున్నట్లుగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె తప్పుకోవడంతో నానితో గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన ప్రియాంక అరుల్ ను ఎంపిక చేసే యోచనలో యూనిట్ సభ్యులు ఉన్నారని కూడా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయిన కారణంగా సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా మరో థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు చందు మొండేటి రూపొందించేందుకు స్ర్కిప్ట్ వర్క్ చేశాడు. ఈ లాక్ డౌన్ సమయంలో మరింతగా స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దినట్లుగా యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాను స్పీడ్ గా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సక్సెస్ ఫార్ములా అవ్వడంతో దర్శకుడు చందు మరియు హీరో నిఖిల్ లు ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకుని ఉన్నారు.