Begin typing your search above and press return to search.

సుశాంత్‌ ఎఫెక్ట్‌ : ఆ భారీ మల్టీస్టారర్‌ క్యాన్సిల్‌

By:  Tupaki Desk   |   13 Aug 2020 7:50 AM GMT
సుశాంత్‌ ఎఫెక్ట్‌ : ఆ భారీ మల్టీస్టారర్‌ క్యాన్సిల్‌
X
బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మృతితో అక్కడ పరిస్థితులు అన్ని మారిపోయాయి. ముఖ్యంగా కరణ్‌ జోహార్‌.. ఆలియా భట్‌.. మహేష్‌ భట్‌ మరికొందరి సినిమాలకు సంబంధించి నిర్ణయాలు మారిపోతున్నాయి. సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మరణంకు కారణం నెపొటిజం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆలియా భట్‌ కరణ్‌ జోహార్‌ వంటి స్టార్స్‌ ను సోషల్‌ మీడియాలో అన్‌ ఫాలో చేయడంతో పాటు ఇటీవల వచ్చిన సడక్‌ 2 చిత్రానికి ఏ స్థాయిలో డిస్‌ లైక్స్‌ ను కొట్టారో మనం చూశాం.

ఇలాంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్‌ తో సినిమా చేయడం ఏమాత్రం శ్రేయష్కరం కాదనే ఉద్దేశ్యంతో కరణ్‌ జోహార్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రతిష్టాత్మక మల్టీస్టారర్‌ మూవీ ‘తఖ్త్‌’ ను ఈ ఏడాది చివర్లో మొదలు పెట్టాలనుకున్నాడు కరణ్‌. ఈ సినిమా కోసం ఆయన చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ నటీనటులు నటించడంతో పాటు భారీ పారితోషికంతో ఈ సినిమాను చేయాలని కరణ్‌ జోహార్‌ భావించాడు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమాను చేయడం వల్ల అన్ని విధాలుగా నష్టపోవాల్సి వస్తుందని కరణ్‌ భావిస్తున్నాడట.

ఆ సినిమాను పక్కకు పెట్టి కరణ్‌ జోహార్‌ కొత్త సినిమాను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఒక సింపుల్‌ కథతో రణ్వీర్‌ సింగ్‌ ఆలియా భట్‌ జోడీగా రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ ను చేయాలని కరణ్‌ జోహార్‌ నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాలో కూడా ఆయన ఆలియాను వదిలి పెట్టక పోవడంతో ఆయనకు ఖచ్చితంగా ఈ సినిమాకు కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటున్నారు.

సడక్‌ 2 చిత్రానికి ఆలియా ఎదుర్కొన్న ట్రోల్స్‌ ను వ్యతిరేకతను మనం చూస్తూనే ఉన్నాం. ఇక కరణ్‌ ఆలియాల కాంబో వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీరి కాంబో మూవీ వచ్చేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. కనుక అప్పటి వరకు పరిస్థితులు మారే అవకాశం లేకపోలేదు అని కొందర భావిస్తున్నారు.