Begin typing your search above and press return to search.
మహేష్ ఆ ముగ్గురితో ఇక ఎప్పటికీ చేయలేడా?
By: Tupaki Desk | 25 May 2020 3:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే వదులుకునేందుకు ఏ దర్శకుడు అయిన సిద్ధంగా ఉంటారా? .. ఇలా వచ్చిన అవకాశాన్ని అలా చటుక్కున పట్టేశాడు పరశురామ్. సూపర్ స్టారతో నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అంటూ ప్రస్తుతం సీరియస్ గా స్క్రిప్ట్ పనులు పూర్తి చేసాడు. అయితే పరశురామ్ కంటే ముందే ముగ్గురు నలుగురు దర్శకులు పూరీతో సినిమా చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు.
వారిలో పూరి జగన్నాథ్.. సుకుమార్ .. వంశీ పైడిపల్లి.. త్రివిక్రమ్ పేర్లు ఉన్నాయి. అయితే ఆ నలుగురిది ఒక్కొక్కరిది ఒక్కో స్టోరి. పూరి పూర్తిగా ఫామ్ కోల్పోయి ఉన్న క్రమంలోనే `జనగనమణ` స్క్రిప్టు వినిపించినా మహేష్ ఎంతమాత్రం డేర్ చేయలేదు. ఆ క్రమంలోనే ఎంతో ప్రయత్నించి విసిగిపోయిన పూరి.. మహేష్ కేవలం బ్లాక్ బస్టర్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తారని మీడియా ముందు సెటైర్ వేశారు. పర్యవసానంగా పూరీపై మహేష్ గుర్రుమన్నారని ప్రచారమైంది.
పూరి వ్యవహారం ఇలా ఉంటే ఏడాది పాటు ఎంతో శ్రద్ధగా స్క్రిప్టు రాసిన సుకుమార్ తాను అనుకున్నట్టు మహేష్ ని ఒప్పించడంలో తడబడ్డాడు. మహేష్ పదే పదే స్క్రిప్టులో మార్పులు కోరడంతో చివరికి విసిగిపోయిన సుక్కూ వెంటనే బన్నీతో ప్రాజెక్టును ప్రకటించాడు. ఆ షాక్ నుంచి కోలుకునేందుకు వంశీ పైడిపల్లితో సినిమా ప్రారంభించాడు మహేష్. తనకోసం ఎంతో వేచి చూసిన పైడిపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా మహర్షి అయిన తర్వాత వెంటనే పైడిపల్లితోనే మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ అది ఊహించని విధంగా క్యాన్సిల్ అయ్యి మధ్యలో పరశురామ్ దూరాడు. పూరి- సుక్కూ అలా స్కిప్ అయ్యారు. మహేష్ 27 పరశురామ్ తో పూర్తయ్యాక రాజమౌళితో 28వ సినిమా చేస్తానని మహేష్ ఇప్పటికే క్లారిటీనిచ్చేశారు. అంటే ఈ మధ్యలో త్రివిక్రమ్ ఎంటరయ్యే ప్రయత్నం చేసినా కష్టమే. అయితే ఈలోగానే పూరి .. సుకుమార్ లాంటి దర్శకులతో తిరిగి సినిమాలు చేసేందుకు వారిని నమ్రత కలుస్తున్నారని.. బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారమవుతోంది. అంటే పరశురామ్ .. రాజమౌళి తర్వాత వీళ్లలో ఎవరికి అవకాశం ఉంటుంది? అన్నది ఇప్పుడే చెప్పలేం అన్నమాట.
వారిలో పూరి జగన్నాథ్.. సుకుమార్ .. వంశీ పైడిపల్లి.. త్రివిక్రమ్ పేర్లు ఉన్నాయి. అయితే ఆ నలుగురిది ఒక్కొక్కరిది ఒక్కో స్టోరి. పూరి పూర్తిగా ఫామ్ కోల్పోయి ఉన్న క్రమంలోనే `జనగనమణ` స్క్రిప్టు వినిపించినా మహేష్ ఎంతమాత్రం డేర్ చేయలేదు. ఆ క్రమంలోనే ఎంతో ప్రయత్నించి విసిగిపోయిన పూరి.. మహేష్ కేవలం బ్లాక్ బస్టర్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తారని మీడియా ముందు సెటైర్ వేశారు. పర్యవసానంగా పూరీపై మహేష్ గుర్రుమన్నారని ప్రచారమైంది.
పూరి వ్యవహారం ఇలా ఉంటే ఏడాది పాటు ఎంతో శ్రద్ధగా స్క్రిప్టు రాసిన సుకుమార్ తాను అనుకున్నట్టు మహేష్ ని ఒప్పించడంలో తడబడ్డాడు. మహేష్ పదే పదే స్క్రిప్టులో మార్పులు కోరడంతో చివరికి విసిగిపోయిన సుక్కూ వెంటనే బన్నీతో ప్రాజెక్టును ప్రకటించాడు. ఆ షాక్ నుంచి కోలుకునేందుకు వంశీ పైడిపల్లితో సినిమా ప్రారంభించాడు మహేష్. తనకోసం ఎంతో వేచి చూసిన పైడిపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా మహర్షి అయిన తర్వాత వెంటనే పైడిపల్లితోనే మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ అది ఊహించని విధంగా క్యాన్సిల్ అయ్యి మధ్యలో పరశురామ్ దూరాడు. పూరి- సుక్కూ అలా స్కిప్ అయ్యారు. మహేష్ 27 పరశురామ్ తో పూర్తయ్యాక రాజమౌళితో 28వ సినిమా చేస్తానని మహేష్ ఇప్పటికే క్లారిటీనిచ్చేశారు. అంటే ఈ మధ్యలో త్రివిక్రమ్ ఎంటరయ్యే ప్రయత్నం చేసినా కష్టమే. అయితే ఈలోగానే పూరి .. సుకుమార్ లాంటి దర్శకులతో తిరిగి సినిమాలు చేసేందుకు వారిని నమ్రత కలుస్తున్నారని.. బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారమవుతోంది. అంటే పరశురామ్ .. రాజమౌళి తర్వాత వీళ్లలో ఎవరికి అవకాశం ఉంటుంది? అన్నది ఇప్పుడే చెప్పలేం అన్నమాట.