Begin typing your search above and press return to search.

బోయపాటి హిట్టు కోడితేనే.. బన్నీ గ్రీన్ సిగ్నల్

By:  Tupaki Desk   |   30 Jan 2023 11:00 AM GMT
బోయపాటి హిట్టు కోడితేనే.. బన్నీ గ్రీన్ సిగ్నల్
X
పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే హిందీలో ఓ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. అయితే బన్నీ ఇంతవరకు తన కొత్త సినిమాలు ప్రకటించలేదు. పుష్ప 2 కోసం మాత్రమే తన సమయాన్ని కేటాయించాడు. కొత్త సినిమాల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే పుష్ప2 కాకుండా ఆ తర్వాత బన్నీ చేయబోయే సినిమాలు ఎలా ఉంటాయి అనేది ప్రస్తుతం సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలో కూడా ఆసక్తికరంగా మారింది.

అయితే ఇప్పటికే పలు స్టార్ దర్శకులు బన్నీతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భారీ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే బోయపాటి పేరు కూడా వినిపించింది. వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారని, చర్చలు కూడా జరుగుతున్నాయని వార్తలు చాలానే వచ్చాయి. ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఇక బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ తో వరుసగా మూడుసార్లు డ్యూయల్ రూల్స్ చేయించి బాక్సాఫీసు వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. దీంతో బన్నీతో చేయబోయే సినిమాకు కూడా అదే ఫార్ములా వాడే అవకాశం ఉన్నట్లు కథనాలు వచ్చాయి. కానీ దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా రావడం పక్కా అని సినీవర్గాలు తెలిపాయి.

అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే బన్నీ బోయపాటి తో తీయబోయే సినిమాలో ఓ నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం బోయపాటి.. రామ్ పోతినేని తో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇది పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో 300 మందితో ఓ భారీ సైట్ యాక్షన్ సీక్వెన్స్ కూడా తెరకెక్కించున్నారట. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో తెలియదు గాని.. ఈ సినిమా హిట్ అయితేనే బోయపాటితో సినిమా చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నారట. లేదంటే సున్నితంగా ఆయన ప్రాజెక్టు తిరస్కరించాలని అనుకున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ బయట కథనాలు వస్తున్నాయి.

ఇక పుష్ప 2 విషయాన్నికొస్తే.. ఈ సినిమా చిత్రీకరణ విశాఖపట్నంలో జరుగుతోంది. హీరో పరిచయ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్స్‌ని తీర్చిదిద్ది షూటింగ్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల చిత్రీకరణ అనంతరం చిత్రబృందం హైదరాబాద్‌ తిరిగి రానుంది. వచ్చే నెలలో మరో కొత్త షెడ్యూల్‌ని ఆరంభిస్తారు. వచ్చే నెలలోనే కథానాయిక రష్మిక ఈ సెట్లోకి అడుగు పెట్టనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.