Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ ని టార్గెట్ చేసిన బాలీవుడ్ బిగ్ గ్యాంబ్ల‌ర్స్

By:  Tupaki Desk   |   21 Oct 2021 7:24 AM GMT
ప్ర‌భాస్ ని టార్గెట్ చేసిన బాలీవుడ్ బిగ్ గ్యాంబ్ల‌ర్స్
X
`బాహుబ‌లి` త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ చూసి బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ హిందీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేయాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేసారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో భారీగా పారితోషికం ఆఫ‌ర్ చేసి భారీ బ‌డ్జెట్ చిత్రాల్ని వ‌రుస‌గా త‌న‌తో నిర్మిస్తానని బిగ్ ఆఫ‌ర్ సైతం ఇచ్చారు. కానీ డార్లింగ్ నో వే అనేసారు. ఇదంతా స‌రిగ్గా `బాహుబ‌లి` రిలీజ్ అయి పాన్ ఇండియా.. పాన్ వ‌రల్డ్ స్థాయిలో క్రేజీ స్టార్ మారిన అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామం. ఆ త‌ర్వాత మ‌రికొంత మంది బాలీవుడ్ నిర్మాత‌లు ప్ర‌య‌త్నించినా ఫ‌లించ‌లేదు. అయితే ఇటీవ‌లే ప్ర‌భాస్ `ఆదిపురుష్` చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో యువిక్రియేష‌న్స్ తో క‌లిసి టీ సిరీస్-రెట్రోఫిలైస్ సంస్థ‌లు సంయుక్తంగా భారీ బ‌డ్జెట్ తో ఆదిపురుష్ 3డి చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భూషణ్ కుమార్-క్రిష్ణ కుమార్-ప్ర‌సాద్ సుతార్- రాజేష్ నాయ‌ర్- ఓరౌంత్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రి క‌ర‌ణ్ కి రాని ఆఫ‌ర్ ఈ నిర్మాత‌ల‌కే ఎందుకొచ్చిదంటే? స్క్రిప్ట్ ప‌రంగానే డార్లింగ్ ని స‌ద‌రు నిర్మాత‌లు లాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇతిహాసం `రామాయ‌ణం` ఆధారం గా ఆదిపురుష్ కోసం అద్భుత‌మైన స్క్రిప్ట్ ని రెడీ చేయ‌డంతోనే ప్ర‌భాస్ ఇంప్రెస్ అయి ఒప్పందం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే తాజాగా ప్ర‌భాస్ తో సినిమా నిర్మించ‌డానికి బాలీవుడ్ నుంచి మ‌రో బ‌డా నిర్మాత సాజిద్ న‌డియావాలా రంగంలోకి దిగిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

డార్లింగ్ ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ ని నిర్మించాల‌ని సాజిద్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మ‌రి ఇందులో వాస్త‌వం ఎంత‌? అన్న‌ది తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ప‌లు పాన్ ఇండియా చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్`లో న‌టిస్తున్నారు. మ‌రోవైపు రాధాకృష్ణ కుమార్ తో క‌లిసి `రాధేశ్యామ్` లోను ప్ర‌భాస్ న‌టించారు. ఇంకోవైపు బాలీవుడ్ సినిమా `ఆదిపురుష్ 3డి` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ మూడు కాకుండా మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్ కె`ని వీలైనంత త్వ‌ర‌గా సెట్స్ కు తీసుకెళ్లాల‌ని చూస్తున్నారు. అలాగే `అర్జున్ రెడ్డి` ద‌ర్శ‌కుడు సందీప్ వంగ‌తో `స్పిరిట్` అనే మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్ టైనింగ్ స్ర్కిప్ట్ ని లాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఇంత బిజీ షెడ్యూల్ న‌డుమ సాజిద్ ఆఫ‌ర్ కి డార్లింగ్ ఎలా స్పందిస్తారో చూడాలి. సాజిద్ కంటే ముందే పాటు ధూమ్ 4లో న‌టించాల్సిందిగా య‌ష్ రాజ్ బ్యాన‌ర్ ఆఫ‌రిచ్చింద‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే.

ధూమ్ -4 లో డార్లింగ్ ప్ర‌భాస్ ఫిక్సేనా?

బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రాంచైజీ `ధూమ్ ` సిరీస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ధూమ్-1 నుంచి ధూమ్ -3 వ‌ర‌కూ ప్ర‌తీ భాగంలో తెర‌పై మేకింగ్ ప‌రంగా అద్భుతాల్ని ఆవిష్క‌రించారు. మొద‌టి భాగంలో జాన్ అబ్ర‌హాం..రెండ‌వ భాగంలో హృతిక్ రోష‌న్..మూడ‌వ భాగంలో అమీర్ ఖాన్ లు న‌టించి ధూమ్ ప్రాచైజీకి వ‌న్నె తీసుకొచ్చారు. యాక్ష‌న్ అడ్వైంచైర్ కేట‌గిరీలో తెర‌కెక్కిన ధూమ్ అన్ని భాగాలు వ‌ర‌ల్డ్ వైడ్ సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేసాయి.

ఈ ప్రాంచైజీ కి ఒక్కో భాగానికి ఒక్కో ద‌ర్శ‌కుడు ప‌నిచేస్తూ అంచ‌నాల్ని అంత‌కంత‌కు పెంచేసారు. ఈనేప‌థ్యంలో పార్ట్-4 పై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. రెండేళ్లుగా ధూమ్ -4 ఎప్పుడు సెట్స్ కు వెళుతుందా అంటూ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో పార్ట్ 4లో న‌టించే హీరో ఎవ‌రు? అన్న‌ది అంతే ఆస‌క్తిక‌రంగా మారింది. స‌ల్మాన్ ఖాన్.. కిలాడీ అక్ష‌య్ కుమార్.. హృతిక్ రోష‌న్ ఇలా ప‌లువురు పేర్లు వినిపించాయి. డార్లింగ్ ప్ర‌భాస్ తోనూ య‌ష్ రాజ్ సంస్థ సంప్ర‌దింపుల్లో ఉంద‌ని చాలాసార్లు క‌థ‌నాలొచ్చాయి. అయితే అస‌లు ఆ హీరో ఎవ‌రు? అన్న‌ది ఇంకా అధికారికంగా ఖ‌రారు కాలేదు. ఇటీవ‌ల ప్ర‌భాస్ తో పాటు కిలాడీ అక్ష‌య్ కుమార్ పేరు మాత్రం బ‌లంగా వినిపిస్తోంది. ధూమ్ -4 లో పాన్ ఇండియా స్టార్...తెలుగు హీరో..రెబల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్నారా లేక కిలాడీ కుమారా? అంటూ డిబేట్ మొద‌లైంది. వ‌ర‌ల్డ్ వైడ్ ప్ర‌భాస్ కున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు.

యాక్ష‌న్ మూవీ సాహో కూడా అదే స్థాయిలో రిలీజ్ అయ్యి బాలీవుడ్ లో ప్ర‌భాస్ కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు.. మార్కెట్ ఏర్ప‌డింది. అదే క్ర‌మంలో ధూమ్-4 లో ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని ప్ర‌చార‌మైంది. ఇంత‌కీ ప్ర‌భాస్ కోసం వేచి చూస్తున్నారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

వార్ ద‌ర్శ‌కుడితో ఫైన‌ల్ అయిన‌ట్టే..!

డార్లింగ్ ప్ర‌భాస్ ఆదిపురుష్ త‌ర్వాత‌ బాలీవుడ్ లో రెండ‌వ చిత్రాన్ని కూడా ఫైన‌ల్ చేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌భాస్ 24వ చిత్రం హిందీలోనే అంటూ ట్విట‌ర్లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రానికి వార్ ఫేం సిద్ధార్ధ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని తెలుస్తోంది. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ క‌థాంశంతో ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని టాక్ ఉంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నుంద‌ని క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి. ద‌ర్శ‌కుడు సిద్ధార్ధ్ ఆనంద్ కు భారీ పారితోషికం చెల్లించ‌నున్నార‌ని.. అడ్వాన్స్ గా ఇప్ప‌టికే కొంత మొత్తం చెల్లించార‌ని కూడా టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇందులో వాస్త‌వం ఎంత? అన్న‌ది నిర్మాణ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టిస్తే గాని క్లారిటీ రాదు.