Begin typing your search above and press return to search.
బాలీవుడ్ నటికి అన్నదాతల నిరసన సెగ!
By: Tupaki Desk | 14 Jan 2021 7:59 AM GMTనరేంద్రమోదీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దాదాపు 50 రోజులుగా ఢిల్లీ శివారులో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అన్నదాతలు ఆందోళన చేస్తున్నప్పటికీ.. ప్రపంచం తన పని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటి, దివంగత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్కు అన్నదాతల నిరసన సెగ తగిలింది.
షూటింగ్ కోసం పంజాబ్కు వెళ్లిన ఆమెను కొంతమంది రైతులు అడ్డుకున్నారు. నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనకు మద్దతు పలకాలని కోరారు. లేకపోతే షూటింగ్ జరగనివ్వబోమని భీష్మించారు.
జాన్వీ కపూర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘గుడ్లక్ జెర్రీ’’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ కోసం యూనిట్.. జనవరి 11న పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్లోని బస్సీ పఠానాకు వెళ్లింది. అక్కడికి చేరుకున్న రైతులు.. తమ ఆందోళనకు జాన్వీ కపూర్ మద్దతు తెలపాలని కోరారు.
ఇందుకు జాన్వీ అంగీకరించడంతో.. కాసేపటి తర్వాత అక్కడి నుంచి రైతులు వెళ్లిపోయారు. ఈ విషయం గురించి చిత్ర నిర్మాత ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘బాలీవుడ్ పరిశ్రమపై అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారని, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతుంటే సెలబ్రిటీలు మౌనం వీడకపోవడాన్ని రైతులు తప్పుబట్టారని అన్నారు.
వారి నిరసన కేవలం జాన్వీపైనో, మరే ఇతర యూనిట్ సభ్యుడిపైనో ద్వేషంతో చేసింది కాదని, తమ ఆందోళనకు మద్దతు తెలపాలని మాత్రమే కోరినట్లు నిర్మాత చెప్పారు. కాగా.. రైతులను సపోర్టు చేస్తూ జాన్వీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. ఇక, ‘గుడ్లక్ జెర్రీ’కి సంబంధించిన జాన్వీ ఫస్ట్లుక్కు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.
షూటింగ్ కోసం పంజాబ్కు వెళ్లిన ఆమెను కొంతమంది రైతులు అడ్డుకున్నారు. నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనకు మద్దతు పలకాలని కోరారు. లేకపోతే షూటింగ్ జరగనివ్వబోమని భీష్మించారు.
జాన్వీ కపూర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘గుడ్లక్ జెర్రీ’’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ కోసం యూనిట్.. జనవరి 11న పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్లోని బస్సీ పఠానాకు వెళ్లింది. అక్కడికి చేరుకున్న రైతులు.. తమ ఆందోళనకు జాన్వీ కపూర్ మద్దతు తెలపాలని కోరారు.
ఇందుకు జాన్వీ అంగీకరించడంతో.. కాసేపటి తర్వాత అక్కడి నుంచి రైతులు వెళ్లిపోయారు. ఈ విషయం గురించి చిత్ర నిర్మాత ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘బాలీవుడ్ పరిశ్రమపై అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారని, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతుంటే సెలబ్రిటీలు మౌనం వీడకపోవడాన్ని రైతులు తప్పుబట్టారని అన్నారు.
వారి నిరసన కేవలం జాన్వీపైనో, మరే ఇతర యూనిట్ సభ్యుడిపైనో ద్వేషంతో చేసింది కాదని, తమ ఆందోళనకు మద్దతు తెలపాలని మాత్రమే కోరినట్లు నిర్మాత చెప్పారు. కాగా.. రైతులను సపోర్టు చేస్తూ జాన్వీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. ఇక, ‘గుడ్లక్ జెర్రీ’కి సంబంధించిన జాన్వీ ఫస్ట్లుక్కు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.