Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌: 'టికెట్ టు ఫినాలే '..గట్టిగా కుమ్ముకున్నారుగా

By:  Tupaki Desk   |   22 Oct 2019 6:20 AM GMT
బిగ్‌ బాస్‌:  టికెట్ టు ఫినాలే ..గట్టిగా కుమ్ముకున్నారుగా
X
బిగ్ బాస్ షో చివరి దశకు రావడంతో కంటెస్టంట్స్ మధ్య కుమ్ములాటలు ఇంకా పెరిగిపోయాయి. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొట్టుకునే టాస్క్ లు ఇచ్చి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆదివారం ఎపిసోడ్ లో వితికా ఎలిమినేట్ కావడంతో ఇంటిలో మిగిలిన 6గురు సభ్యులకు టికెట్ టు ఫినాలే’ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో ఒకరు మాత్రమే గెలిచి ఫినాలేకి వెళతారు. మిగిలిన ఐదుగురు నామినేషన్ లో ఉంటారు. ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదట ఇంటి సభ్యులకు బోర్డుపై ఉన్న వివిధ కలర్ బ్లాక్స్‌లో నుంచి వారికి నచ్చిన బ్లాక్ తీసుకొని దాని మీద ఏముందో చెప్పాలని బిగ్ బాస్ సూచించారు.

దీంతో ఆ బ్లాక్ ల్లో అలీకి 70% - శివజ్యోతి-60% - శ్రీముఖి-50% - రాహుల్-50% - బాబా భాస్కర్-40% - వరుణ్-40% అనే బోర్డులు వచ్చాయి. ఈ నెంబర్లు అన్ని బ్యాటరీలోని చార్జింగ్ పర్సెంటేజ్ లు. వీటితోనే ఇంటి సభ్యులు టాస్క్ ఆడతారు. అందుకోసం గార్డెన్ ఏరియాలో రెండు బెల్స్ ఏర్పాటు చేశారు. బజర్ మోగిన ప్రతిసారి మొదటిసారి బెల్‌ను మోగించిన ఇద్దరు ఇంటి సభ్యులు ఒక టాస్క్‌లో పోటీపడాల్సి ఉంటుంది. అయితే బెల్ మ్రోగించిన వెంటనే వారి బ్యాటరీ 10 శాతం తగ్గుతుంది. ఇక టాస్క్‌ లో గెలిచిన వారికి 10 శాతం బ్యాటరీ రీఫిల్ అవుతుంది.

ఇక మొదటి బజర్ మ్రోగినప్పుడు బెల్ కొట్టి శివజ్యోతి - అలీలు పోటీ పడ్డారు. ఇందులో అరటిపళ్ళు తినే టాస్క్ ఇచ్చారు. ఇందులో అలీ గెలిచి 10 శాతం బ్యాటరీ పెంచుకున్నాడు. నెక్ట్ వరుణ్ - రాహుల్ బెల్ కొట్టి టాస్క్ లో పాల్గొన్నారు. వీరు థర్మకోల్ బాల్ బ్యాగులని తగిలించుకుని - ఒకరి బ్యాగుని ఒకరు ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇందులో రాహుల్-వరుణ్ లు ఒకరిపై ఒకరు పడి మరి టాస్క్ లో పాల్గొన్నారు. చివరికి రాహుల్ గెలవడంతో..తను బ్యాటరీని 10 శాతం పెంచుకున్నాడు.

నెక్స్ట్ మూడో రౌండ్ లో శ్రీముఖి - బాబా భాస్కర్ పోటీ పడగా...బాబా గెలిచి 10 శాతం బ్యాట‌రీ చార్జ్ పెంచుకున్నాడు. ఇక నాలుగో రౌండ్ లో బాబా - అలీలు బెల్ కొట్టారు. దీంతో వారిద్దరు టాస్క్ లో పోటీ పడి కుమ్ముకున్నారు. వీరి కుమ్ములాట మంగళవారం ఎపిసోడ్లో కూడా కొనసాగనుంది.