Begin typing your search above and press return to search.

SSMB 28 నైజాం హక్కులు.. బిగ్ ఆఫర్స్!

By:  Tupaki Desk   |   30 Jan 2023 4:03 PM GMT
SSMB 28 నైజాం హక్కులు.. బిగ్ ఆఫర్స్!
X
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఎస్​ఎస్​ఎంబీ 28'. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్​టైన్మెంట్​ మూనీవి నిర్మిస్తోంది అయితే ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కుల గురించి కొద్ది కాలంగా ఓ పెద్ద చర్చే నడుస్తోంది.

ఈ చిత్ర హక్కుల కోసం తీవ్ర పోటీ నడుస్తుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్ర నైజాం హక్కులు దిల్​ రాజు చేజారిపోయిందని, ఏషియన్ ఫిల్మ్స్ కు రికార్డు ధరకు సొంతం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా అందించిన సమాచారం ప్రకారం ఈ చర్చ ఇంకా నడుస్తూనే ఉందని తెలుస్తోంది. దిల్​ రాజు ఈ రైట్స్​ కోసం రూ.50కోట్లు ఆఫర్​ చేశారని సమాచారం తెలుస్తోంది. అయితే మరోవైపు ఏషియన్ సునీల్​ సిండికేట్​ కూడా రూ.48కోట్లకు అడగుతున్నారని వినిపిస్తోంది. మరి ఇందులో ఏది ఫైనల్​ అవుతుందో, ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

నిజానికి నైజాం, వైజాగ్ ప్రాంతాలకు చాలా కాలంగా దిల్ రాజు లీడింగ్ డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతున్నారు. అగ్ర బ్యానర్లు మైత్రీ మూవీ మేకర్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సహా ఇతరులు నిర్మించిన చిత్రాలను ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్​తో కూడా ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి.

అయితే ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ దిల్ రాజును కాదని నైజాంలో తమ సొంత డిస్ట్రిబ్యూషన్ హౌస్‌ను ప్రారంభించి.. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలను సొంతంగా విడుదల చేసుకంది. ఆ సినిమాలు అన్ని చోట్లా భారీ బిజినెస్ చేశాయి.

ఇకపోతే గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలను దిల్ రాజే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అతడికి ప్రొడ్యూసర్స్ ఎస్ రాధా కృష్ణ(హారిక అండ్ హాసిని క్రియేషన్స్​), నాగ వంశీతో(సితార ఎంటర్​టైన్మెంట్స్​) మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే మరోవైపు మహేశ్ బాబు.. ఏషియన్ సునీల్‌తో బిజినెస్​లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్​ఎస్​ఎంబీ 28 రైట్స్ ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.