Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU E11 : టాస్క్‌ లతో రణరంగంగా మారిన హౌస్‌

By:  Tupaki Desk   |   16 Sep 2021 3:30 AM GMT
#BIGGBOSS5TELUGU E11 : టాస్క్‌ లతో రణరంగంగా మారిన హౌస్‌
X
బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల్లో గొడవలు చాలా కామన్ గా జరిగే విషయం. కాని తాజా ఎపిసోడ్‌ లో మాత్రం రచ్చ రచ్చ అన్నట్లుగా సాగింది. ఇంటి సభ్యులను రెండు జట్లుగా విభజించిన విషయం తెల్సిందే. రెండు జట్లలో కూడా మరీ చిల్లర బ్యాచ్ ఉన్నట్లుగా ఉన్నారు. రెండు వైపుల కూడా పంథం నీదా నాదా అన్నట్లుగా పోటా పోటీగా రచ్చ చేశారు. ఒకరిని మించిన ఒకరు అన్నట్లుగా గొడవలకు దిగారు. శ్రీరామచంద్ర మరియు మానస్ లు కెప్టెన్ లుగా వ్యవహరిహిస్తున్న రెండు జట్లు కూడా టాస్క్ ల విషయంలో ఎక్కడ తగ్గకుండా హోరా హోరీగా పోరాటం సాగించాయి. ఇదే సమయంలో శ్రీరామ చంద్ర మరియు మానస్ ల మద్య అప్పుడప్పుడు మాటల యుద్దం జరిగింది. మానస్ ను ఏజ్ అడిగిన శ్రీరామ చంద్ర కాస్త చిన్న చూపుతో మాట్లాడాడు. 28 అని చెప్పిన సమయంలో ఇంకా నువ్వు చిన్న పిల్లాడివే మెచ్యూరిటీ రాలేదు అనడంతో మానస్ కూడా రివర్స్ ఎటాక్ ఇచ్చాడు. మీ ఏజ్ పెరిగినా కూడా మెచ్యూరిటీ కనిపించడం లేదు అంటూ కౌంటర్‌ వేశాడు. మొత్తానికి ఇద్దరు కెప్టెన్ లు రచ్చ చేశారు.

ఎల్లో అండ్‌ బ్లూ టీమ్స్ సాగర సోదర టాస్క్ లో పాల్గొన్న సమయంలో ఎల్లో టీమ్‌ 33.3 మీటర్లు ఉండగా బ్లూ టీమ్ మాత్రం 33 మీటర్లు మాత్రమే ఉన్నారు. కొలతలు పూర్తి అయిన తర్వాత ఇద్దరు నోట్ చేసుకున్న నేపథ్యంలో మానస్‌ డన్ అన్నాడు. దాంతో చివర్లో ఉన్న శ్వేత రిలాక్స్ అయ్యేందుకు చేతులు కింద పెట్టింది. దాంతో బ్లూ టీమ్‌ కెప్టెన్ అయిన శ్రీరామచంద్ర ఆమె చేయి కింద పెట్టింది కనుక తాము ఒప్పుకోము అంటూ పదే పదే చెప్పడంతో మానస్ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్‌ అయ్యాడు. ఆ సమయంలో ఇద్దరు కెప్టెన్ లు కలిసి ఏకాభిప్రాయంతో సాగర సోదర టాస్క్ లో విజేతలు ఎవరు అనే విషయాన్ని చెప్పాల్సిందిగా సూచించినా కూడా వారు చెప్పక పోవడంతో టాస్క్ ను రద్దు చేస్తున్నట్లుగా బిగ్‌ బాస్‌ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బిగ్‌ బాస్‌ మొదటి టాస్క్‌ ఇలా రసాబాసగా మారింది. ఆ టాస్క్ క్యాన్సిల్‌ అవ్వడంపై రవి చాలా అసంతృప్తి వ్యక్తం చేశాడు. సిగ్గు పడాలి అంటూ అవతలి టీమ్ ను ఉద్దేశించి మాట్లాడటంతో మేము సిగ్గు పడము.. మీరు సిగ్గు పడండి అంటూ శ్రీరామ చంద్ర వ్యాఖ్యలు చేశాడు.

గేమ్‌ మద్యలో రవి వెళ్లి శ్రీరామ చంద్రతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో శ్రీరామ చంద్ర నీ గేమ్‌ నువ్వు ఆడుకో నాతో మైండ్‌ గేమ్ ఆడకు అంటూ రవితో డైరెక్ట్‌ గా అనేశాడు. దాంతో రవి అక్కడ నుండి సైలెంట్ గా వచ్చేశాడు. మళ్లీ గేమ్ మొదలు పెట్టారు. గేమ్‌ లో ఎల్లో టీమ్‌ వద్ద ఎక్కువగా పిల్లోస్ ఉన్న కారణంగా విజేతలుగా నిర్ణయించడం జరిగింది. మొత్తానికి ఈ గేమ్‌ లో ఇరు జట్లు కూడా హోరా హోరీగా పోరాటం సాగించాయి. రెండు జట్ల సభ్యులు కూడా ఇంటిని రణరంగంగా మార్చి రచ్చ చేసి గెలిచేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రియా ఆంటీ మరియు సన్నీల మద్య కాస్త సీరియస్ ఫైట్‌ జరిగింది. మగాడివి అయితే వచ్చి ఆడు ఆంటూ ప్రియా చేసిన వ్యాఖ్యలతో సన్నీ సహనం కోల్పోయాడు. అతడు కూడా మాటలతో సమాధానం ఇచ్చాడు. టాస్క్‌ పూర్తి అయిన తర్వాత స్విమ్మింగ్ పూల్‌ వద్ద శ్రీరామ చంద్ర మరియు హమీదాల మద్య కాస్త రొమాన్స్ సాగింది. హమీదాకు మసాజ్‌ చేస్తూ ఆమెను ప్లట్‌ చేసేలా శ్రీరామ చంద్ర మాట్లాడటం జరిగింది.

టాస్క్ మొదటి రోజు అస్వస్థతకు గురి అయిన లోబో తాజా ఎపిసోడ్‌ లో కూడా ఆడలేదు. అతడు పూర్తి విశ్రాంతి మూడ్ లో ఉన్నాడు. గేమ్ ఆడలేనందుకు క్షమాపణలు చెప్పాడు. నాకు ఏమైనా ఐతే నా కుటుంబాన్ని చూసుకునే వారు లేరు. అందుకే నేను ఆడలేక పోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక బిగ్‌ బాస్‌ హౌస్ లో ఎవరు ఎలా ఉంటారు.. ఎలా ఆడుతారు అనేది టాస్క్ ల సమయంలోనే తెలుస్తుంది. అది తాజా టాస్క్ లో వెళ్లడి అయ్యింది. శ్రీరామ చంద్ర గురించి ఇన్ని రోజులు మంచి ఒపీనియర్ తో ఉన్న వారు ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో ఆయన తీరును చాలా మంది తప్పుబడుతున్నారు. ప్రియా కూడా కొన్ని సందర్బాల్లో ఆవేశంతో ఊగిపోతున్నారు. సాదారణంగా అయితే ఆమె చాలా నార్మల్‌ గా ఉంటారు. ఇక సిరి ప్రతి విషయాన్ని కూడా పెద్దదిగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా టాస్క్ ల సమయంలో తమ విశ్వరూపం చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.