Begin typing your search above and press return to search.

సర్వైవల్ థ్రిల్లర్ గా 'దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌'!

By:  Tupaki Desk   |   17 Aug 2022 11:17 AM GMT
సర్వైవల్ థ్రిల్లర్ గా దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌!
X
సంగీత దిగ్గ‌జం కీర‌వాణి త‌న‌యుడు శ్రీ సింహ కోడూరి టాలీవుడ్ కి సుప‌రిచితుడే. ఇప్ప‌టికే న‌టుడిగా కొన్ని సినిమాలు చేసాడు. తాజాగా త‌మిళ‌నటుడు స‌ముద్ర‌ఖ‌ని-సింహా కోడూరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. నూతన దర్శకుడు సతీష్ త్రిపుర దర్శకత్వం లో సురేష్ ప్రొడక్షన్స్ - గురు ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలతో సినిమాకి మంచి బ‌జ్ క్రియేట్ అవుతుంది. సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని న‌టిస్తుండం అద‌నంగా క‌లిసొస్తుంది. ఇటీవలే చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు జ‌రుగుతున్నాయి. తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే సినిమాకి సంబంధించిన కొత్త పోస్ట‌ర్ ఒక‌టి రిలీజ్ చేసారు.

పోస్టర్‌లో ఓ వైపు సింహ కోడూరి - మరో వైపు సముద్రఖని సీరియ‌స్ లుక్ ని గ‌మ‌నించ‌వ‌చ్చు. సింహా కాస్త సీరియస్‌గా క‌న్నెర‌జేసి కనిపిస్తుండగా.. విసుగు చెందిన‌ సముద్రఖని తలపై వేళ్లు పెట్టుకుని సీరియ‌స్ గా ఏదో ఆలోచ‌న చేస్తున్న‌ట్లు కనిపిస్తున్నాడు. పోస్టర్‌లో కారును కూడా మనం గమనించవచ్చు.

ఇదొక డిఫ‌రెంట్ జోన‌ర్ లా క‌నిపిస్తుంది. తెలుగులో రిలీజ్ అవుతున్న‌ తొలి సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం గా యూనిట్ ప్ర ఆచ‌రం చేస్తుం ది. సాధార‌ణ దోపిడి భ‌యాన‌కంగా మారితో ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అన్న పాయింట్ ని సినిమాలో హైలైట్ చేస్తున్నారు. చిన్న దొంగత‌నానికి కూడా పాల్ప‌డ‌ని వ్య‌క్తి జీవితంలో చోటు చేసుకునే ఓ ఘ‌ట‌న అత‌ని జీవితాన్ని ఎన్ని మ‌లుపులు తిప్పింది అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తున్నారు.

ఈపాయింట్ నే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా చూపించ‌బోతున్నారు. సినిమాని టెక్నిక‌ల్ గాను ఉన్న‌తంగా మ‌లుస్తున్నట్లు తెలుస్తోంది. కాల భైర‌వ సంగీతం హైలైట్ గా నిలుస్తుంద‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. ఇటీవ‌లే ఆయ‌న సంగీతం అందించిన 'కార్తికేయ‌-2' పెద్ద స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో ఆ కోవ‌లోనే దొంగ‌లున్నారు జాగ్ర‌త్త కూడా నిలుస్తుంద‌ని కాన్పిడెంట్ గా ఉన్నారు.

ఈ సినిమా రిలీజ్ తేదీని అధికారికంగా ప్ర‌క‌టించారు. సినిమాని నేరుగా థియేట‌ర్లో నే సెప్టెంబర్ 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చినా ఇలాంటి థ్రిల్ల‌ర్ చిత్రాలు థియేట‌ర్ లో చూస్తేనే బెస్ట్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంద‌ని భావించి థియేట‌ర్ రిలీజ్ కి మొగ్గు చూపిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో ప్రీతి అస్రాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇంకా ప్రతిభావంతులైన సాంకేతిక బృందం పని చేస్తుంది. యశ్వంత్ సి ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌గా.. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.