Begin typing your search above and press return to search.

అనుష్క శెట్టికి కథలు వినే మూడ్ లేదంట

By:  Tupaki Desk   |   10 Jun 2023 11:01 AM GMT
అనుష్క శెట్టికి కథలు వినే మూడ్ లేదంట
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి బాహుబలి సిరీస్ తర్వాత సినిమాలు భాగా తగ్గించేసింది. బాహుబలి 2 తర్వాత ఇప్పటి వరకు నిశ్శబ్దం మూవీతో మాత్రమే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ లో మహేష్ దర్శకత్వంలో మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి మూవీలో అనుష్క లీడ్ రోల్ చేస్తోంది. ఈ మూవీలో అనుష్కకి జోడీగా నవీన్ పొలిశెట్టి నటిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.

40+లో ఉన్న అనుష్క కమర్షియల్ సినిమాలు పూర్తిగా పక్కన పెట్టేసింది. అలాగే ఫిమేల్ సెంట్రిక్ కథలపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. కాని ప్రస్తుతం అవి కూడా చేయడానికి ఆమె ఆసక్తి చూపించడం లేదంట. చాలా మంది దర్శక, నిర్మాతలు ఫిమేల్ సెంట్రిక్ కథలతో అనుష్కని కలుస్తున్నారంట.

కథలని కూడా నేరేట్ చేసే ప్రయత్నం చేస్తున్న ఆమె పెద్దగా ఆసక్తి చూపించడం లేడని టాక్. మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి రిలీజ్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకోవాలని అనుష్క భావిస్తున్నారంట.

ఇంట్లో వారు కూడా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండటం ప్రస్తుతానికి సినిమాలపై ఆమె ద్యాస పెట్టడం లేదని ప్రచారం నడుస్తోంది. మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి సినిమా కూడా ప్రభాస్ హోం బ్యానర్ అయిన యూవీ నుంచి వస్తోంది కావడంతో ఆ చిత్రం కమిట్ అయినట్లు టాక్ నడుస్తోంది.

మరి అనుష్క పూర్తిగా సినిమాల నుంచి తప్పుకుంటుందా లేదా మళ్ళీ కొన్నేళ్ళు గ్యాప్ ఇచ్చి ఫిమేల్ సెంట్రిక్ కథలు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా అనుష్క పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా నడుస్తోంది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటారు అనే రూమర్స్ వచ్చాయి.

అయితే వాటిలో వాస్తవం లేదని ప్రభాస్, అనుష్క ఇద్దరు ఖండించారు. తరువాత ఆమె పలు ఆలయాలు దర్శించుకుంటూ కనిపించడంతో పెళ్లి కోసం పూజలు చేస్తోందని ప్రచారం నడించింది. బెంగళూరుకి చెందిన ఓ వ్యాపారవేత్తని అనుష్క పెళ్లి చేసుకోబోతోంది అంటూ ప్రస్తుతం టాక్ నడుస్తోంది. ఈ కారణంగానే ఆమె సినిమాలకి విరామం ఇవ్వాలని అనుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.