Begin typing your search above and press return to search.

కరోనాతో మరో సినీ నటుడు మృతి !

By:  Tupaki Desk   |   18 Jun 2021 5:37 AM GMT
కరోనాతో మరో సినీ నటుడు మృతి !
X
కరోనా వైరస్ మహమ్మారి ఎంతోమంది ప్రజల ప్రాణాలను తీసేస్తోంది. సామాన్యుల నుండి విఐపిలు , వివిఐపిలు , రాజకీయ ప్రముఖులు , వ్యాపారవేత్తలు ఈ మహమ్మారి దెబ్బకి కన్నుమూశారు. అలాగే సినీ రంగానికి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు కూడా కరోనా మహమ్మారి భారిన పడి కోలుకోలేక కన్నుమూశారు. మరికొందరు ప్రముఖులు వారి ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరొకరు చేరారు. సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు శామన్‌ మిత్రు బుధవారం సాయంత్రం చెన్నైలో కరోనా కారణంగా చివరి శ్వాస విడిచారు. చెన్నై ఫిల్మ్‌ ఇన్‌ స్టిట్యూట్‌లో శిక్షణ పొంది బంగారు పతకాన్ని పొందిన శామన్‌ మిత్రు మొదట్లో ఛాయా గ్రాహకుడిగా తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాలకు పనిచేశారు.

ఆ తర్వాత దర్శకుడిగా మారి తొరట్టి అనే చిత్రాన్ని నిర్మించి హీరోగా నటించారు. ఆ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు అందుకుంది. ఇదిలా ఉంటే .. శామన్‌ మిత్రు నెలరోజుల క్రితం కరోనా బారిన పడి క్రోంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి లో ట్రీట్మెంట్ కోసం చేరారు. అయితే , చికిత్స అందించినప్పటికీ కూడా అయన కరోనా ను ఎదుర్కోలేక , బుధవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మృతిచెందారు. శామన్‌ మిత్రుకు భార్య శకుంతల, కుమార్తె మోక్ష ఉన్నారు. శామన్‌ మిత్రు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.