Begin typing your search above and press return to search.

తన ఫస్ట్ పీరియడ్ అనుభవాన్ని షేర్ చేసుకున్న అనసూయ..!

By:  Tupaki Desk   |   31 May 2020 8:04 AM GMT
తన ఫస్ట్ పీరియడ్ అనుభవాన్ని షేర్ చేసుకున్న అనసూయ..!
X
తెలుగు ప్రేక్షకులుకు స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై షోలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై తన హవా చూపిస్తోంది. యాంకర్‌ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సినిమాల్లో సైతం వరుస అవకాశాలు కొట్టేస్తోంది. సుకుమార్‌ - రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’లో 'రంగమ్మత్త'గా అందరిని మెప్పించింది. ఆ సినిమాతో అనసూయ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 'క్షణం' 'కథనం' 'ఎఫ్ 2' 'సోగ్గాడే చిన్నినాయనా' 'మీకుమాత్రమే చెప్తా' చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్స్ కి ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అనసూయ సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా మహిళలకు సంభందించిన విషయాలపై నిర్మొహమాటంగా నిర్భయంగా తన ఒపీనియన్ చెప్తూ ఉంటుంది. వెండితెర బుల్లితెరలపై తనదైన శైలిలో రాణిస్తున్న అనసూయ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికే పరిమితమై రెగ్యులర్‌ గా సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటూ అలరిస్తోంది. తాజాగా మెన్స్ట్రువల్ ఎడ్యుకేషన్ కు సంభందించి ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో పాలుపంచుకుంది.

మే 28న 'అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ లో భాగంగా తన మొదటి పీరియడ్స్ అనుభవాన్ని దైర్యంగా అందరితో షేర్ చేసుకుంది. ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. అనసూయ మాట్లాడుతూ.. ''నా ఫస్ట్ పీరియడ్ సమయంలో నేను గందరగోళానికి లోనయ్యాను. పీరియడ్ వచ్చిందా లేదా అనే డౌట్ వచ్చింది. నా మొదటి పీరియడ్ సమయంలో ఇంట్లో వాళ్ళు నన్ను ఎక్కడికి వెళ్లనీయకుండా ఇంట్లోనే ఓ మూలన కూర్చోబెట్టారు. ఫస్ట్ పీరియడ్ టైములో రెండు వారాలు అలానే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రతినెలా నాలుగైదు రోజులు ఎవరినీ కలవనిచ్చేవారు కాదు. ఆ టైంలో ఏమి జరుగుతుందో నాకేమీ అర్థమయ్యేది కాదు. కానీ నాకు 17 ఇయర్స్ వచ్చిన తర్వాత దాని గురించి ఒక అవగాహన వచ్చింది. ఇంట్లో వాళ్ళు పీరియడ్స్ విషయంలో చేసింది కరెక్ట్ కాదని అర్థం అయింది.. కానీ వారిని నిందించడానికి ఏమీ లేదు. ఎందుకంటే అప్పటి పరిస్థితులు అలా ఉండేవి. పీరియడ్స్ గురించి ఎన్నో అపోహలు మూఢనమ్మకాలు ఉన్నాయి. నిజానికి అలాంటి సమయంలోనే మహిళలకి హెల్ప్ అవసరం. అలా దూరంగా ఉంచడం కరెక్ట్ కాదు'' అని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా సమాజంలో ఇప్పటికి చాలా చోట్ల ఇలాంటి అపోహలు ఇంకా ఉన్నాయి. పీరియడ్స్ అనేది ఏదో తప్పైనట్లు లేడీస్ వాటి గురించి మాట్లాడడానికి భయపడుతుంటారు. కొంతమంది మగవాళ్ళు పీరియడ్స్ సమయంలో వారిని అర్థం చేసుకోకుండా లోకువగా మాట్లాడుతుంటారు. అది చాలా తప్పు. ఇంటికి మహాలక్ష్మిగా భావించే ఆడవారు మన జీవితంలో ఉండటం.. కుటుంబంలో ఉండటం ఒక వరం. 'అమ్మ'గా భార్యగా చెల్లిగా కూతురిగా టీచర్ గా ఫ్రెండ్ గా ఇలా అన్ని పాత్రల్లో స్త్రీ ఉంటుంది. సృష్టికి మూలకారణమే స్త్రీ అని అంటుంటారు. అలాంటిది వారిలో సహజంగా వచ్చేదే పీరియడ్. కాబట్టి అందరూ దీనిపై ఎడ్యుకేట్ అవ్వాలి. నెలసరిలో ఉన్న లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తూ వారి భాదను షేర్ చేసుకుంటూ వారికి అండగా ఉండండి'' అని చెప్పుకొచ్చింది అనసూయ. ఏదేమైనా యాంకర్ అనసూయ తన ఫస్ట్ పీరియడ్ గురించి ఇలా డేర్ గా అందరితో షేర్ చేసుకోవడం గొప్ప విసయమనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.