Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : బ్లాక్ స్కర్ట్ లో పూరీ హీరోయిన్ సోయగాలు...!

By:  Tupaki Desk   |   11 Aug 2020 11:34 AM GMT
ఫోటో స్టోరీ : బ్లాక్ స్కర్ట్ లో పూరీ హీరోయిన్ సోయగాలు...!
X
అనన్య పాండే.. బాలీవుడ్ నటుడు చంకీ పాండే వారసురాలిగా 'స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తన అందాలతో ఫస్ట్ సినిమాతోనే సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. వెంటనే 'పతీ పత్నీ ఔర్ ఓహ్' అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - విజయ దేవరకొండ కాంబినేషన్ లో మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది అనన్య. పాన్ ఇండియా లెవల్లో తెలుగు తమిళంతోపాటు హిందీలో కూడా రూపొందుతున్న ఈ సినిమాని పూరీ - చార్మీ కౌర్ - కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా నిలిచిపోయింది.

ఇదిలా ఉండగా అనన్య పాండే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ వీలైనప్పుడల్లా హీట్ పుట్టించే ఫోటోలను పోస్టు చేస్తూ కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంది. కరోనా కారణంగా ఇన్నాళ్లు స్వీయ నిర్బంధంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో తొడలు కనిపించేలా ధరించిన బ్లాక్ స్కర్ట్ లో అమ్మడు మెరిసిపోతోంది. చాన్నాళ్ల తర్వాత బయటకి వచ్చాననే ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ బీచ్ కే అందాన్ని తెచ్చేలా ఫోజ్ ఇచ్చింది. అనన్య పాండే పూరీ సినిమాతో పాటు ఇషాన్ ఖత్తర్ తో కలిసి 'ఖాళీ పీలీ' అనే సినిమాలో కూడా నటిస్తోంది.