Begin typing your search above and press return to search.

కరోనాని జయించిన బిగ్ బి...!

By:  Tupaki Desk   |   2 Aug 2020 3:30 PM GMT
కరోనాని జయించిన బిగ్ బి...!
X
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనాని జయించాడు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన అమితాబ్ బచ్చన్ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమితాబ్ తో పాటు ఫ్యామిలీ మెంబెర్స్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యా రాయ్ - ఆరాధ్య లకు కరోనా సోకింది. అయితే ఇటీవల ఐశ్వర్య - ఆరాధ్య కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు అమితాబ్ కి టెస్ట్ లో నెగిటివ్ రావడంతో ఆయనని డిశ్చార్జ్ చేసారు.

కాగా అమితాబ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ''కోవిడ్ టెస్ట్ లో నెగిటివ్ రావడంతో నన్ను డిశ్చార్జ్ చేసారు. ఇంటికి తిరిగొచ్చి ఒంటరిగా క్వారంటైన్ లో ఉన్నాను. మా బాబుజీ యొక్క ఆశీర్వాదం మరియు ఆత్మీయులు స్నేహితులు, అభిమానులు ప్రియమైన వారి ప్రార్ధనల వలన.. నానావతి హాస్పిటల్ వారు తీసుకున్న కేర్ వల్ల నేను ఈరోజుని చూడటం సాధ్యమైంది'' అని ట్వీట్ చేశారు అమితాబ్. దీంతో బిగ్ బి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు అభిషేక్ బచ్చన్ కి కరోనా టెస్టులో పాజిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ.. తన తండ్రికి తాజాగా చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ తేలిందని.. దీంతో ఆసుపత్రి నుంచి ఆయనను డిశ్చార్జ్ చేసారని తెలిపారు. ఇకపై ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోనున్నారు.. తన తండ్రి కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. దురదృష్టవశాత్తూ నాకు కరోనా పరీక్షలో పాజిటివ్ అని తేలింది.. నేను హాస్పిటల్ లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను.. త్వరలోనే దీన్ని జయిస్తానని పేర్కొన్నాడు.