Begin typing your search above and press return to search.

పవిత్ర స్థలంలో ఏంటా పనులు..? హీరోయిన్ పై విమర్శలు..!

By:  Tupaki Desk   |   9 Jun 2023 5:48 PM GMT
పవిత్ర స్థలంలో ఏంటా పనులు..? హీరోయిన్ పై విమర్శలు..!
X
సెలబ్రెటీలు ఏం చేసినా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారు ఏదైనా తప్పు చేస్తే వెంటనే విమర్శలతో ఏకిపారేస్తూ ఉంటారు. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ, తెలియకుండానే కొన్ని సార్లు పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలా పొరపాట్లు చేసి విమర్శలపాలైన వారు చాలా మందే ఉన్నారు. మొన్నటికి మొన్న ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ కి, దర్శకుడు ఆలయంలో ముద్దు పెట్టడం ఎంత వివాదం అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కాగా, తాజాగా మరో సెలబ్రెటీ కపుల్ పవిత్ర స్థలంలో చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. గదర్ 2 మూవీ నటీనటులు అమీషా పటేల్, సన్నీ డియోలు లు ఇటీవల గురుద్వార్ కి వెళ్లారు. మూవీ షూటింగ్ లో భాగంగా చిత్ర బృందం అక్కడకు వెళ్లింది. ఆ సమయంలో హీరో, హీరోయిన్ల మధ్య కౌగిలింతలు, ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారు.

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యంగా సిక్కులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమ పవిత్ర ప్రదేశంలో ఇలాంటి సీన్లు ఎలా తీస్తారని వారు కూడా మండిపడుతున్నారు.

కాగా, ఈ ఘటనపై గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్ సంధు స్పందించారు. అమీషా పటేల్, సన్నీడియోల్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తామని చిత్ర బృందం తమను కోరిందని చెప్పారు.

అయితే, మూవీ షూటింగ్ చేసేటప్పుడు ఎలాంటి దురుద్దేశపూర్వక సన్నివేశాలు తీయడం లేదని వారు చెప్పారని ఆయన అన్నారు. భైసాఖి పండుగ ప్రాముఖ్యత దృష్టా కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు ఇలాంటి సన్నివేశాలు తీయడమేమిటని ఆయన మండిపడుతున్నారు.

శిరోమణి గురుద్వార్ పర్బంధక్ కమిటీ కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ కూడా ఈ విషయంపై స్పందించారు. గురుద్వారలో నమస్కరించే దృశ్యాన్ని చిత్రీకరిస్తామని చిత్ర బృందం చెప్పిందన్నారు. కానీ ఆ తరువాత రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించడం తమకు తెలీదన్నారు. ఇది కరెక్ట్ కాదని ఆయన ఫైర్ అయ్యారు. ఈ వివాదం దర్శకుడు అనిల్ శర్మ, నటీనటులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.