Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమాతో బన్నీ మల్టీప్లెక్స్ లాంచ్

By:  Tupaki Desk   |   30 May 2023 7:29 PM GMT
ప్రభాస్ సినిమాతో బన్నీ మల్టీప్లెక్స్ లాంచ్
X
ప్రస్తుతం మన స్టార్ హీరోలు అందరూ కూడా సినిమాలు చేస్తూనే వ్యాపార రంగంలో కూడా అడుగుపెడుతున్నారు. కొంతమంది థియేటర్స్ బిజినెస్ లోకి దిగితే మరి కొంతమంది నిర్మాణరంగంలో అడుగుపెట్టి కొత్త దర్శకులని ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమాల ద్వారా సంపాదిస్తున్న మొత్తం వ్యాపారాలలో పెట్టుబడులుగా పెడుతున్నారు. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు.

ఏఎంబి మల్టీప్లెక్స్ థియేటర్స్ ని హైదరాబాద్ లో నడుపుతున్నారు. ఏఎంబి ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. అలాగే తన సినిమాలకి నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా రీసెంట్ గా వి మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేసి కొత్త వాళ్లతో సినిమాలు నిర్మించడానికి రెడీ అయ్యారు.

విజయ్ దేవరకొండ కూడా మహబూబ్ నగర్ లో మల్టీప్లెక్స్ థియేటర్స్ నడుపుతున్నారు. ప్రభాస్ కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో పెట్టుబడులు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ కూడా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ బ్యానర్ స్టార్ట్ చేసి సినిమా నిర్మాణరంగంలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నారు.

ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే తాత పేరు మీద ఒక మూవీ స్టూడియో నిర్మించారు. అలాగే అమీర్ పేట జంక్షన్ లో సత్యం థియేటర్స్ కొనుగోలు చేసి దానిని మల్టీప్లెక్స్ గా డెవలప్ చేశారు. ఇప్పటికే ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యింది. ఇంటీరియర్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. సత్యం మల్టీప్లెక్స్ ఓపెన్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. ఆదిపురుష్ మూవీతో అల్లు అర్జున్ సత్యం మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ధ్రువీకరించకపోయిన ఆదిపురుష్ మూవీతో సత్యం మల్టీప్లెక్స్ ప్రారంభిస్తే శుభసూచకంగా కూడా ఉంటుందని భావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది.