Begin typing your search above and press return to search.

చైతూ నో చెప్పిన ప్రాజెక్ట్‌ ను సామ్‌ చేస్తుందా?

By:  Tupaki Desk   |   24 Jan 2020 1:13 PM GMT
చైతూ నో చెప్పిన ప్రాజెక్ట్‌ ను సామ్‌ చేస్తుందా?
X
ఆర్‌ ఎక్స్‌ 100 చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి. మొదటి సినిమా హిట్‌ అవ్వగానే ఈయనతో సినిమాలు చేసేందుకు పలువురు యంగ్‌ హీరోలు ఆసక్తి చూపించారు. కాని ఈయన మాత్రం మహాసముద్రం అనే ప్రాజెక్ట్‌ ను పట్టుకుని ఇద్దరు ముగ్గురు హీరోల చుట్టు తిరిగాడు. కాని ఆ హీరోలు కాస్త చేద్దాం చేద్దాం అంటూ ఆలస్యం చేస్తూ వచ్చారు. చివరకు నాగచైతన్య వద్దకు వచ్చి అజయ్‌ భూపతి ఆగాడు.

అజయ్‌ భూపతి పలు సార్లు నాగచైతన్యనకు కథ చెప్పాడని.. అదే సమయంలో సమంతకు కూడా ఈ చిత్రం కథ చెప్పడంతో ఇద్దరు కలిసి నటిస్తారంటూ వార్తలు వచ్చాయి. మహాసముద్రం చిత్రంను నాగచైతన్య మరియు సమంతలతో తెరకెక్కిస్తే యమ క్రేజ్‌ వస్తుందని అజయ్‌ భూపతి భావించి ఉంటాడు. కాని నాగచైతన్య ఏదో ఒక కారణం చెప్పి సినిమాను ఆలస్యం చేస్తున్నాడని అదే స్క్రిప్ట్‌ తో శర్వానంద్‌ తో సినిమా చేయాలని అజయ్‌ భూపతి ఫిక్స్‌ అయ్యాడట.

ఇటీవలే శర్వాకు స్క్రిప్ట్‌ నరేట్‌ చేయడంతో ఆయన ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. నాగచైతన్య టైం ఇవ్వక పోవడంతో అక్కడ నుండి వచ్చేసిన అజయ్‌ భూపతి ఈ సినిమాలో హీరోయిన్‌ గా సమంతనే అనుకుంటున్నాడట. శర్వానంద్‌ కు జోడీగా సమంతను తీసుకోవాలనే చర్చలు చిత్ర యూనిట్‌ లో జరుగుతున్నాయట. ఇప్పటికే శర్వానంద్‌ మరియు సమంతలు జాను చిత్రంలో నటించారు. కనుక మరో సారి వారిద్దరు కలిసి నటించేందుకు ఒప్పుకుంటారని ఆయన భావిస్తున్నాడు.

సమంతను అతి త్వరలోనే కలువబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అయితే తన భర్త లేని ఆ ప్రాజెక్ట్‌ లో సమంత నటిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ సమంత ఈ ప్రాజెక్ట్‌ లో నటిస్తే చైతూ ఈగో హర్ట్‌ అయ్యే అవకాశం కూడా ఉందని.. అందుకే శర్వాకు జోడీగా మహాసముద్రంలో నటించక పోవడం మంచిదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి సమంత నిర్ణయం ఏంటో చూడాలి.