Begin typing your search above and press return to search.

ఐశ్వర్య ఆరాధ్యల ఆరోగ్య పరిస్థితి ఏంటీ.. వారు ఎక్కడున్నారంటే!

By:  Tupaki Desk   |   13 July 2020 5:15 AM GMT
ఐశ్వర్య ఆరాధ్యల ఆరోగ్య పరిస్థితి ఏంటీ.. వారు ఎక్కడున్నారంటే!
X
దేశ వ్యాప్తంగా బచ్చన్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ ఆరోగ్య పరిస్థితి గురించిన చర్చ జరుగుతోంది. మొదట అమితాబచ్చన్‌ ఆ తర్వాత అభిషేక్‌ బచ్చన్‌ లు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. ఆ తర్వాత కొన్ని గంటలకు తదుపరి టెస్టులో ఐశ్వర్య రాయ్‌ ఇంకా ఆమె కుమార్తె ఆరాధ్య కూడా కరోనా పాజిటివ్‌ గా రిపోర్ట్‌ వచ్చింది. అమితాబచ్చన్‌ ఇంకా అభిషేక్‌ బచ్చన్‌ లు ముంబయిలోని నానవతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి ఐశ్వర్య ఇంకా ఆరాధ్యలు ఎక్కడ ఉన్నారు వారి ఆరోగ్య పరిస్థితి ఏంటీ అనేది చర్చనీయాంశంగా ఉంది.

వైధ్యులు ఐశ్వర్య ఇంకా ఆరాధ్యలకు పాజిటివ్‌ వచ్చిన మాట వాస్తవమే కాని వారికి లక్షణాలు ఎక్కువగా లేవని అన్నారు. వారు హాస్పిటల్‌ లో ఉండాలా లేదంటే ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలా అనేది కుటుంబ సభ్యుల ఇష్టంగా వైధ్యులు పేర్కొన్నారు. డాక్టర్ల ప్రకటన తర్వాత అభిషేక్‌ బచ్చన్‌ ట్విట్టర్‌ లో ఆ విషయమై స్పందిస్తూ ఐశ్వర్య మరియు ఆరాధ్యలు ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు. వారికి ఐసోలేషన్‌ అక్కర్లేదని వైధ్యులు చెప్పిన కారణంగా వారు ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ట్వీట్‌ చేశాడు.

జయా బచ్చన్‌ ఇతర కుటుంబ సభ్యులకు నెగటివ్‌ వచ్చినా కూడా వారిని స్వీయ నిర్భందంలో ఉండాలని అధికారులు సూచించారు. ఐశ్వర్య రాయ్‌ ఇంకా ఆరాధ్యలను ప్రతి రోజు అబ్జర్వ్‌ చేస్తూ అవసరం అయితే వారిని ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. రెండు వారాల పాటు బచ్చన్‌ ఫ్యామిలీ అంతా కూడా ఇతరులకు పూర్తి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే సమయంలో బచ్చన్‌ ఇంటి పరిసర ప్రాంతాలను కంటోన్మెంట్‌ ఏరియాలుగా ముంబయి మున్సిపల్‌ అధికారులు ప్రకటించారు.