Begin typing your search above and press return to search.

న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్న వివాదాస్పద నటి...!

By:  Tupaki Desk   |   5 Jun 2020 6:45 AM GMT
న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్న వివాదాస్పద నటి...!
X
మహేష్ బాబు 'అతిథి' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తెలుగమ్మాయి మాధవీలత 'నచ్చావులే' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత 'స్నేహితుడు' 'అరవింద్ 2' లాంటి అడపాదడపా సినిమాల్లో నటించింది. ఈ భామ సినిమాల ద్వారా ఫేమస్ అయింది తక్కువే అయినా.. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా ఫేమస్ అవుతూ వచ్చింది. సినిమాలకు దూరమైన తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవీ లత ఇటీవల బీజేపీలో చేరి రాజకీయాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలో స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మధ్య శ్రీరెడ్డి, రాకేష్‌ మాస్టర్లను టార్గెట్‌ చేస్తూ మాధవీ లత చేసిన కామెంట్స్ ఓ రేంజ్‌ లో వైరల్ అయ్యాయి. వారిద్దరూ అమ్మడి మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వారికి లీగల్ నోటీసులు కూడా పంపిన సంగతి తెలిసిందే. ప్రజంట్ బీజేపీ పార్టీలో కొనసాగుతున్న ఈ భామ అదే పార్టీకి చెందిన యామిని సాధినేని మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.

అంతేకాకుండా ఇటీవల లాక్‌ డౌన్‌ లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయింది మాధవీ లత. ''అసలు ఆగట్లేదుగా జనాలు.. మాస్క్‌లు వేసుకుని పెళ్లిళ్లు ఎందుకు? ముహూర్తం మళ్లీ రాదా? ఇది పోతే శ్రావణం.. అదీ పోతే మేఘమాసం.. లేకుండా మరో సంవత్సరం తరువాత ముహూర్తం వస్తుంది కదా.. ఏ పెళ్లి పిల్ల దొరకదా.. లేకుంటే పిల్లోడు మారిపోతాడా?'' అంటూ పోస్ట్ పెట్టి విమర్శలకు గురైంది. ఈ క్రమంలో మరోసారి నెటిజన్స్ ఆసక్తి చూపించే పోస్ట్ పెట్టింది మాధవీ లత. అయితే ఈసారి ఎవరి మీదో వివాదాస్పదమైన పోస్ట్ కాకుండా తన వ్యక్తిగత సంభందించిన విషయాలు అని డౌట్ పడేలా చేసింది.

''ఎన్నో నెలల తరువాత చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభం అయ్యింది. అద్భుతాలు జరిగాయి. అందుకే నేను ఎప్పుడూ మిరాకిల్స్‌ ను నమ్ముతాను. చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను'' అంటూ పోస్ట్ చేసింది. తాజాగా మాధవీలత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్ట్‌ లో తన పెళ్లి ప్రస్తావన తీసుకు రాక పోయినా నెటిజెన్లు మాధవీ లత కామెంట్స్ పెళ్లి గురించే అనే అభిప్రాయానికి వచ్చేసారు. అయితే దీనికి కొంతమంది నెటిజన్స్ మాత్రం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా అని అమ్మడిని ప్రశ్నించగా.. లేదు ఇంకా యాక్టివ్‌ గా అవుతున్నానని తెలిపింది. మరి మాధవీలత లైఫ్ లో జరిగిన ఆ మిరాకిల్ ఏంటో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.