Begin typing your search above and press return to search.

గొంతు నొప్పి జ్వ‌రంతో ఆస్ప‌త్రిలో చేరితే

By:  Tupaki Desk   |   23 Jan 2020 9:30 AM GMT
గొంతు నొప్పి జ్వ‌రంతో ఆస్ప‌త్రిలో చేరితే
X
క‌మెడియ‌న్ ట‌ర్న్ డ్ సునీల్ అనారోగ్యానికి గుర‌య్యార‌ని నేడు(గురువారం) గ‌చ్చిబౌళి గ్యాస్ట్రో ఎంట్రాల‌జీ ఆస్ప‌త్రిలో చేరార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గ్యాస్ట్రిక్ స‌మ‌స్య వ‌ల్ల స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌వ్వ‌డంతో ఆస్ప‌త్రిలో చేర్పించార‌ని ప్ర‌చార‌మైంది. అయితే దీనిపై సునీల్ స్పందించారు.

తాను గొంతు నొప్పి తో బాధ‌ ప‌డుతున్నాన‌ని.. సైన‌స్ స‌హా ఇత‌ర స‌మ‌స్య‌ల వ‌ల్ల గత వారం రోజులుగా జ్వరం తో బాధ పడుతున్నాన‌ని సునీల్ వెల్ల‌డించారు. డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు మాదాపూర్ ఏ.ఐ.జి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాన‌ని తెలిపారు. యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల లంగ్స్ త్రొట్ లో ఇన్ఫెక్షన్ అయ్యింద‌ని వెల్ల‌డించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జ‌రుగుతోందిట‌.

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన `డిస్కోరాజా` ఈనెల 24న రిలీజ‌వుతోంది. ఈ చిత్రంలో సునీల్ ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌ను పోషించారు. త‌దుప‌రి క‌ల‌ర్ ఫోటో అనే చిత్రంలో విల‌న్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు. హీరోగా అవ‌కాశాలు వ‌చ్చినా సునీల్ గ‌త కొంత‌కాలంగా తిర‌స్క‌రిస్తున్నారు. క‌మెడియ‌న్ గా కొన‌సాగేందుకే ఆసక్తిని క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. అర‌వింద స‌మేత‌- అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల్లో స్నేహితుడు త్రివిక్ర‌మ్ సునీల్ కి అవ‌కాశం ఇచ్చారు.