Begin typing your search above and press return to search.

న‌టుడు పొట్టి వీరయ్య మృతికి చిరు సంతాపం

By:  Tupaki Desk   |   26 April 2021 4:30 AM
న‌టుడు పొట్టి వీరయ్య మృతికి చిరు సంతాపం
X
ప‌లు భాష‌ల్లో దాదాపు 500 సినిమాల్లో కీలకమైన అతిథి పాత్రలను పోషించిన‌ ప్రముఖ తెలుగు నటుడు పొట్టి వీరయ్య హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. హృద్రోగంతో ఆసుపత్రిలో చేరిన ఆయ‌న చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. నేడు ఆయ‌న‌ చివరి కర్మలు సోమవారం జరుగుతాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఫానిగిరి గ్రామానికి చెందిన గట్టు వీరయ్య చిన్నప్పటి నుంచీ రంగస్థల క‌ళాకారుడు. సినీరంగంలో ద‌శాబ్ధాల పాటు ఆయ‌న సేవ‌లందించారు.

ప‌రిశ్ర‌మ‌కు సుదీర్ఘ కాలం సేవ‌లందించిన వీర‌య్య మృతి ప‌ట్ల సానుభూతిని వ్య‌క్త‌ప‌రుస్తూ.. మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియ‌జేశారు. చిరంజీవి మాట్లాడుతూ-``వ్యక్తిగతంగా.. వృత్తిపరంగా ఎన్నో సవాళ్ళను అధిగమించి.. వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ట్టి వీరయ్య గారి మృతి ఎంతో కలచి వేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఆయ‌న‌ ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకొంటున్నాను`` అని అన్నారు.

సినిమా వాళ్లే లేకపోతే నేను ఎప్పుడో చనిపోయే వాడిన‌ని .. చిరంజీవి స్థాపించిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ వల్లే నేను ఈరోజు బతుకుతున్నా అని వీర‌య్య ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. సినిమాల్లేక‌పోయినా మా అసోషియేషన్ ప్రతి నెలా పెన్ష‌న్ ఇచ్చి ఆదుకుంద‌ని తాను తీవ్ర అనారోగ్యంతో ఉన్న‌ప్పుడు దర్శ‌క‌ర‌త్న డా. దాస‌రి నారాయ‌ణ‌రావు .. మెగాస్టార్ చిరంజీవి స‌హా ఎందరో ఆర్థిక సాయం చేశార‌ని వెల్లడించారు. ఇంత‌కుముందు వీర‌య్య అనారోగ్యానికి చికిత్స కోసం చిరు 2ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేసిన సంగ‌తి తెలిసిందే.