Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో భారీ ధర పలికిన 'అల వైకుంఠపురంలో'

By:  Tupaki Desk   |   6 April 2020 5:45 AM GMT
బాలీవుడ్ లో భారీ ధర పలికిన అల వైకుంఠపురంలో
X
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తన హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన “అల వైకుంఠపురంలో” సినిమా సంక్రాంతికి విడుదలై థియేటర్లలో కనక వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాతలతో పాటు, డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలు రావడం జరిగింది. తెలుగులో విడుదలైన సినిమాలకు బాలీవుడ్ లో మంచి గిరాకీ ఉంది. మంచి సినిమాలను ఎంత పెట్టి కొనడానికైనా బాలీవుడ్ నిర్మాతలు వెనకడుగు వేయరు. అందులో భాగంగా “అల వైకుంఠపురంలో” సినిమాను దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలకు అశ్విన్ వర్దె అనే నిర్మాత సొంతం చేసుకున్నట్లు సమాచారం.

గతంలో ఇతడే తెలుగు లో సంచలనం సృష్టించిన “అర్జున్ రెడ్డి”ని కూడా సొంతం చేసుకున్నాడు. అతడికి “అల వైకుంఠపురంలో” సినిమా పిచ్చ పిచ్చగా నచ్చడంతో ఈ సినిమాపై భారీగా ఖర్చుల పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను బాలీవుడ్ లో ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ తో రీమేక్ చేయనున్నట్లు సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అన్నీ కుదిరాక అధికారిక వివరాలు తెలియజేస్తారట అశ్విన్. ఇలా దాదాపుగా మరొక ఎనిమిది కోట్ల రూపాయలు నిర్మతల జేబులో పడటంతో ఈ సినిమా రికార్డ్స్ సృష్టిస్తూ త్రివిక్రమ్ – అల్లు అర్జున్ హిట్ పెయిర్ గా మరోసారి నిలిచింది. అశ్విన్ వర్దెతో కలిసి అల్లు అరవింద్ కూడా ఈ రీమేక్ ని సంయుక్తంగా నిర్మించాలని అనుకుంటున్నారట. చూడాలి మరి ఈ రీమేక్ గురించి ఏం కబుర్లు అందనున్నాయో..