Begin typing your search above and press return to search.

ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయ‌డ‌మే తెలుసు: జ‌గ‌న్ హాట్ కామెంట్స్‌

ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల వర్షాల కార‌ణంగా వ‌ర‌దతో మునిగిపోయిన ప్రాంతాల్లోని బాధితుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు.

By:  Tupaki Desk   |   7 Aug 2023 8:14 AM GMT
ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయ‌డ‌మే తెలుసు:  జ‌గ‌న్ హాట్ కామెంట్స్‌
X

వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పోల‌వ‌రం ప్రాంతంలో ఉన్న కూన‌వ‌రంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల వర్షాల కార‌ణంగా వ‌ర‌దతో మునిగిపోయిన ప్రాంతాల్లోని బాధితుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. బాధితుల‌కు బాస‌ట‌గా నిలిచేందుకు ప్ర‌భుత్వం అన్ని విధాలా ముందుంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే అధికారులు క్షేత్ర‌స్థాయిలో బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌ర్య‌టిస్తున్నార‌ని... అక్క‌డే ఉంటున్నార‌ని చెప్పారు.

పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తున్న‌ట్టు జ‌గ‌న్ తెలిపారు. పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెల‌ప‌నుంద‌ని చెప్పారు. పోలవరం పరిహారం కేంద్రమే స్వయంగా చెల్లించినా పర్వాలేదని అన్నారు. ముంపు ప్రాతాల్లో లీడార్‌ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతోందని తెలిపారు.

మూడు దశల్లో పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతామ‌ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు. ఒక్కసారిగా నింపితే డ్యామ్‌ కూలిపోవచ్చున‌ని, నిబంధనల ప్రకారం పోలవరం డ్యాంలో నీళ్లు నింపే కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.

వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదని ముఖ్య‌మంత్రి చెప్పారు. నిర్వాసితుల‌కు సాయం చేయ‌డంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు. ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయ‌డ‌మే త‌న‌కు తెలుసున‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ మంచి జ‌ర‌గాల‌నే తాప‌త్రయంతోనే తాము ప‌నిచేస్తున్నామ‌ని చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు త‌మ‌పై రాళ్లు విసురుతున్నార‌ని.. ప‌రోక్షంగా టీడీపీని ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిహారం అంద‌ని వారు అంటూ ఏ ఒక్క‌రూ లేర‌న్నారు. ఎవ‌రైనా.. ఉన్నారా? అంటూ.. బిగ్గ‌ర‌గా అరిచారు. అయితే, ఎవ‌రూ లేక‌పోవ‌డంతో త‌న స్వ‌రాన్ని మ‌రింత పెంచిన సీఎం.. విప‌క్షాలు ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాల‌ని అన్నారు.