Begin typing your search above and press return to search.

హైటెక్‌ సిటీ ఫ్లైఓవర్‌ పై నుంచి పడి యువతి మృతి!

చికిత్స పొందుతూ స్వీటీ పాండే కన్నుమూసింది. ఘటనపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 4:29 AM GMT
హైటెక్‌  సిటీ ఫ్లైఓవర్‌  పై నుంచి పడి యువతి మృతి!
X

మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైటెక్‌ సిటీ ఫ్లైఓవర్‌ పై నుంచి కిందపడి యువతి మృతి చెందింది. ఇదే ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలిని కోల్‌ కతా (పశ్చిమ బెంగాల్)కు చెందిన స్వీటీ పాండేగా గుర్తించారు!

అవును... కోల్‌ కతాకు చెందిన స్వీటీ పాండే(22) స్నేహితుడితో కలిసి జే.ఎన్‌.టీ.యూ. నుంచి ఐకియా వైపు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. అతడు అతివేగంగా బైక్‌ నడుపుతూ హైటెక్‌ సిటీ ఫ్లైఓవర్‌ పై గోడను ఢీకొట్టాడు. దీంతో బైక్‌ పై వెనుక కూర్చున్న స్వీటీ పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్‌ పైనుంచి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది.

గోడను ఢీకొనడంతో అతడికీ గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ స్వీటీ పాండే కన్నుమూసింది. ఘటనపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వీటీ పాండే హైదరాబాద్‌ లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ లోయర్ ట్యాంక్‌ బండ్‌ లో నివాసం ఉంటోంది. ఆమె స్నేహితుడు హైదరాబాద్ నగరానికి వచ్చాడు. దీంతో గురువారం సాయత్రం వీరిద్దరూ కలిసి నగరంలో ఉన్న తమ మిత్రులను కలిసేందుకు బయల్దేరారని..ఆ సందర్భంలోనే ఈ ప్రమాధం జరిగిందని తెలుస్తోంది.