Begin typing your search above and press return to search.

ఇక‌, ప‌ద‌వుల పంప‌కాలు.. టీడీపీకి మేయ‌ర్ పీఠం..26న డిప్యూటీ మేయ‌ర్ అవిశ్వాసంపై ఓటింగ్

గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ను కైవ‌సం చేసుకున్న కూట‌మి పార్టీలు.. ఇప్పుడు ప‌ద‌వుల పంప‌కంపై దృష్టి పెట్టా యి. మేయ‌ర్ గొల‌గాని హ‌రి వెంక‌ట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కూట‌మి పార్టీలు విజ‌యం ద‌క్కించుకున్నాయి.

By:  Tupaki Desk   |   20 April 2025 11:13 AM IST
ఇక‌, ప‌ద‌వుల పంప‌కాలు.. టీడీపీకి మేయ‌ర్ పీఠం..26న డిప్యూటీ మేయ‌ర్ అవిశ్వాసంపై ఓటింగ్
X

గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ను కైవ‌సం చేసుకున్న కూట‌మి పార్టీలు.. ఇప్పుడు ప‌ద‌వుల పంప‌కంపై దృష్టి పెట్టా యి. మేయ‌ర్ గొల‌గాని హ‌రి వెంక‌ట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కూట‌మి పార్టీలు విజ‌యం ద‌క్కించుకున్నాయి. ఈ నేప‌థ్యంలో కూట‌మి పార్టీల హ‌వా పెరిగింది. దీంతో ఇప్పుడు మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వుల‌ను పంచుకునేందుకు పార్టీలు సిద్ధ‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం మేయ‌ర్ పీఠానికి మాత్ర‌మే అవిశ్వాస తీర్మానం జ‌రిగినందున ఈ సీటు మాత్ర‌మే ఖాళీ అవుతుంది. కానీ, డిప్యూటీ మేయ‌ర్ విష‌యం మ‌రోసారి తీర్మానం చేసి అవిశ్వాసం ప్ర‌వేశ పెట్టాల్సి ఉంటుంది.

దీనికి వారం రోజులు స‌మ‌యం ప‌డుతుంది. ఈ క్ర‌మంలో ఈ నెల 26న డిప్యూటీ మేయ‌ర్ అవిశ్వాసంపై ఓటింగ్ జ‌ర‌గ‌నుంది. దీనికి కూడా కోరం పూర్తిగా స‌హ‌క‌రించాలి. ఒక్కొక్క‌సారి మేయ‌ర్ విష‌యంలో అవిశ్వాసం నెగ్గినా.. డిప్యూటీ మేయ‌ర్ విష‌యం లో మాత్రం అవిశ్వాసం ఓడిపోయిన సంద‌ర్భాలు ఉన్నాయి. దీంతో కూట‌మి పార్టీలు ఈ నెల 26న జ‌ర‌గ‌నున్న డిప్యూటీ మేయ‌ర్ అవిశ్వాస ప‌రీక్ష వ‌ర‌కు కూడా.. కార్పొరేట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తంగా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. దీంతో భీమిలిలో నిర్వ‌హిస్తున్న క్యాంపును ఈ నెల 26వ తేదీ వ‌ర‌కు కొన‌సాగించ‌నున్న‌ట్టు టీడీపీ నాయ‌కులు ప్ర‌క‌టించారు.

ఇక‌, మేయ‌ర్ , డిప్యూటీమేయ‌ర్ విష‌యాలకు వ‌స్తే.. కూట‌మి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌లు ఈ రెండు ప‌ద‌వులు పంచుకునేందు కు సిద్ధ‌మ‌య్యాయి. వివాదాల‌కు అతీతంగా ఈ ప‌ద‌వుల‌పై ఇప్ప‌టికే ఒక క్లారిటీ వ‌చ్చాయి. మేయ‌ర్ పీఠాన్ని టీడీపీ తీసుకుం టుంద‌ని, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని జ‌న‌సేన‌కు కేటాయించ‌నున్న‌ట్టు టీడీపీరాష్ట్ర చీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావు పేర్కొన్నారు. ఇక‌, ఈ రెండు ప‌ద‌వుల విష‌యంలో నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు.

అయితే.. మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వుల‌ను ఆశిస్తున్న‌వారి పేర్ల‌ను ఎంపిక చేసి.. అధిష్టానానికి స‌మ‌ర్పించ‌నున్నారు. ఇదిలావుంటే.. వైసీపీ బీసీ మ‌హిళ‌ను మేయ‌ర్‌ను చేసిన నేప‌థ్యంలో ఇప్పుడు బీసీనికాద‌ని ఓసీ లేదా.. మైనారిటీ వ‌ర్గాల‌కు ఇచ్చే అవ‌కాశం లేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో కూట‌మి కూడా.. బీసీ నాయ‌కుల‌కే మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. కాగా.. ఈ ప్ర‌క్రియ పూర్తి అయ్యేందుకు రెండు నుంచి మూడు వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుస్తోంది.