Begin typing your search above and press return to search.

విశాఖలో ఆరాచకం.. బాలికపై గ్యాంగ్ రేప్?

అసలేం జరిగిందంటే.. ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి విశాఖపట్నంలోని ఒక అపార్టుమెంట్ లో వాచ్ మన్ గా పని చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 4:33 AM GMT
విశాఖలో ఆరాచకం.. బాలికపై గ్యాంగ్ రేప్?
X

ఉక్కు నగరి విశాఖలో దారుణమైన ఘోర ఘటన ఒకటి బయటకు వచ్చింది. ఒక బాలికపై పది మంది యువకులు వారం రోజులుగా నరకం చూపించిన ఆరాచక ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి విశాఖపట్నంలోని ఒక అపార్టుమెంట్ లో వాచ్ మన్ గా పని చేస్తున్నాడు. అతడి కుటుంబం కంచరపాలెంలో నివాసం ఉంటుంది.

ఆ మధ్యవయస్కుడికి పదిహేడేళ్ల కుమార్తె ఉంది. ఆమె ఒక నేవీ అధికారి ఇంట్లో సహాయకురాలిగా పని చేస్తోంది. డిసెంబరు 17న పని వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో.. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు. కట్ చేస్తే.. ఆమె తమ సొంతూరు వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకొని ఊరికి వెళ్లి ఆమెను విశాఖకు తీసుకొచ్చారు.

అప్పటికే షాక్ లో ఉనన ఆమె ఎవరితోనూ మాట్లాడలేదు. చివరకు పలు ప్రయత్నాల అనంతరం ఆమె నోరు విప్పింది. తనపై జరిగిన ఆఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో.. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లుగా చెబుతున్నారు. బాధితురాలు కొన్నాళ్ల క్రితం ఒక యువకుడితో ప్రేమలో పడినట్లుగా పేర్కొంది.

అతడి కోరిక మేరకు డిసెంబరు 17న ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్ వద్దకు వెళ్లింది. అక్కడ వీరిద్దరూ శారీరకంగా కలిసిన తర్వాత ఆ యువకుడు తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అతను హోటల్ కు వచ్చి.. ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రేమించినోడే అతని స్నేహితుడితో అత్యాచారం చేయించటంతో మనస్తాపానికి గురైన బాలిక బీచ్ కు వెళ్లి విలపిస్తుండగా.. గుర్తించిన మరో వ్యక్తి ఓదార్చినట్లుగా నటించి ఆమెను స్నేహితుల గదికి తీసుకెళ్లాడు.

ఆ తీసుకెళ్లిన వ్యక్తిని ఫోటోగ్రాఫర్ గా పోలీసులు గుర్తించారు. అలా ఆమెను తమ రూంకు తీసుకెళ్లిన అతను.. మరో ఏడుగురు కలిసి బాలికను హింసించి.. అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత నగర పరిధిలోని పలు హోటళ్లకు.. లాడ్జిలకు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. వెంటనే స్పందించి.. విచారణ చేపట్టారు. నిందితుల్ని పట్టుకునే పని మీద ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగిలిన వారి కోసం గాలింపులు చేపట్టారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. అపరిచితుల్ని నమ్మొద్దని.. ప్రేమించిన వారైనా.. వారి వివరాల విసయంలో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు.