Begin typing your search above and press return to search.

వైరల్ లవ్ స్టోరీ: అతడికి 80 - ఆమెకు 34... కోర్టులో పెళ్లి!

ఇతని వయసు 80 ఏళ్లు కాగా.. ఇతడు ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె వయసు 34 ఏళ్లు! ప్రేమే కాదు సుమా... పెళ్లి కూడా జరిగింది!!

By:  Tupaki Desk   |   6 April 2024 4:41 AM GMT
వైరల్  లవ్  స్టోరీ:  అతడికి 80 - ఆమెకు 34... కోర్టులో పెళ్లి!
X

ప్రేమకు కులమత బేదాలు ఉండవు.. ప్రాంతీయ వేదాలు ఉండవు.. స్వదేశం, విదేశం అనే తారతమ్యాలూ ఉండవు అంటారు! అంతవరకూ ఓకే కానీ... ప్రేమకు వయసు కూడా అడ్డు కాదు.. 80 ఏళ్ల వయసులోనూ దానికి అలుపు రాదు అంటున్నారు బాలురామ్ అనే వ్యక్తి. ఇతని వయసు 80 ఏళ్లు కాగా.. ఇతడు ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె వయసు 34 ఏళ్లు! ప్రేమే కాదు సుమా... పెళ్లి కూడా జరిగింది!!

అవును... మధ్యప్రదేశ్‌ లోని అగర్ మాల్వా జిల్లాలో తాజాగా ఒక అరుదైన వివాహం జరిగింది. మహారాష్ట్రకు చెందిన షీలా అనే 34 ఏళ్ల మహిళకు, మధ్యప్రదేశ్ లోని లోని మగారియా గ్రామానికి చెందిన బలూరామ్‌ అనే 80 ఏళ్ల వృద్ధుడికి కు మధ్య చిగురించిన ప్రేమ సుస్నర్ పట్టణంలోని కోర్టు వివాహానికి దారి తీసింది.

వివరాళ్లోకి వెళ్తే... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలురామ్... అతడి స్నేహితుడు విష్ణు గుజ్జర్ సహాయంతో ఇన్ స్టా గ్రాం లో ఫన్నీ వీడియోలను అప్ లోడ్ చేసేవాడు! ఈ సమయంలో ఆ వీడియోలకు ముగ్దురాలైన మహారాష్ట్రకు చెందిన షీలా... సోషల్ మీడియా ద్వారా బాలురామ్ ను సంప్రదించాలని నిర్ణయించుకుంది. అక్కడ నుంచి మొదలైంది వీరి సంభాషణల సందడి!

ఇక అక్కడి నుంచి మెసేజ్ లు, కాల్స్ తో మొదలైన వ్యవహారం ప్రేమ.. పెళ్లి పీటల వరకూ చేరింది. దీంతో... వీరి వివాహం ఇప్పుడు వైరల్ గా మారింది. వీరి ప్రేమ వివాహంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వారి క్రియేటివిటీకి పని చెబుతున్నారు. ఇక సింగిల్స్ అయితే... లబోదిబో మంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి!!

అగర్ మాల్వా జిల్లాలోని చిన్న గ్రామమైన మగారియాకు చెందిన బలురామ్.. రెండేళ్ల క్రితం తీవ్ర డిప్రెషన్‌ లో ఉన్నాడు. బాలురామ్‌ కు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అంతా వివాహాలు చేసేసుకుని ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో బలురామ్ భార్య అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి బలురామ్ ఒంటరిగానే ఉంటున్నాడు.

ఈ సమయంలోనే మహారాష్ట్రలోని అమరావతిలో నివసించే షీలా ను సోషల్ మీడియాలో కలిశారు. ఇద్దరూ చాటింగ్‌ చేయడం ప్రారంభించారు. ఇలా మొదలైన వారి పరిచయం కాస్తా ప్రేమలో మునిగి తేలేవరకూ వెళ్లింది. ఈ సమయంలోనే అతడిని వివాహం చేసుకోవాలని షీలా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆమె తన ఇంటి నుండి బయలుదేరి బాలరామ్ నివాసానికి చేరుకుంది. ఈ క్రమంలోనే వారిద్దరూ వివాహం చేసుకున్నారు.