Begin typing your search above and press return to search.

కేసీయార్ తో ఢీ... కామారెడ్డి నుంచి రాములమ్మ...?

గతంలో మెదక్ ఎంపీగా టీయారెస్ నుంచి గెలిచిన విజయశాంతి మరోసారి అక్కడ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Aug 2023 6:27 PM GMT
కేసీయార్ తో ఢీ... కామారెడ్డి నుంచి రాములమ్మ...?
X

కేసీయార్ విపక్షాలకు బిగ్ టాస్క్ ఇచ్చేశారు. తన పార్టీ నుంచి దాదాపుగా అభ్యర్ధులను అందరినీ ప్రకటించేశారు. 115 మందిలో కేసీయార్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. అందులో ఆయన ఆది నుంచి నిలబడుతున్న గజ్వేల్ సీటు ఒకటైతే రెండవది కామారెడ్డి సీటు. ఈ సీటు కేసీయార్ ఒక భారీ వ్యూహం ప్రకారమే ఎంపిక చేసుకున్నారు అని అంటున్నారు.

మొత్తం నిజమాబాద్ సహా ఉత్తర తెలంగాణాలో బీయారెస్ ని పటిష్టం చేయడం ఊపు తీసుకుని రావడమే టార్గెట్ గా కేసీయార్ బరిలోకి దిగబోతున్నారు. ఇదిలా ఉంటే కేసీయార్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ నుంచి కూడా రెడీ అంటున్నారు. ఆయనను ఢీ కొట్టడానికి గట్టి అభ్యర్దులు విపక్షాలకు అవసరం ఉంది.

కామారెడ్డిలో కాంగ్రెస్ కి మాజీ మంత్రి, లోకల్ క్యాండిడేట్ షబ్బీర్ అలీ ఉన్నారు. బీజేపీకి లోకల్ లీడర్స్ ఉన్నా కూడా కేసీయార్ అంటే గట్టిగానే అభ్యర్ధులు ఉండాలి అని కమలం పార్టీ భావిస్తోంది. దాంతో విజయశాంతి పోటీ చేస్తారు అని అంటున్నారు. గతంలో మెదక్ ఎంపీగా టీయారెస్ నుంచి గెలిచిన విజయశాంతి మరోసారి అక్కడ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.

అయితే కామారెడ్డిలో కేసీయార్ అనగానే బీజేపీ నేతలకు ఠక్కున రాములమ్మ పేరు గుర్తుకు వస్తోంది. దీంతో ఇపుడు ఇది ఒక రేంజిలో ప్రచారం అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో విజయశాంతి దీని మీద రియాక్ట్ అయ్యారు. ఎవరిని ఎక్కడ నుంచి పోటీకి దించాలో అధినాయకత్వం నిర్ణయిస్తుంది అని అన్నారు. అధినాయకత్వం డెసిషన్ ని అంతా పాటించాలని ఆమె పేర్కొన్నారు.

ఏది ఏమైనా గజ్వేల్ లో కామారెడ్డిలో బీజేపీ గెలుపు రాష్ట్రానికి మేలు చేస్తుంది అని అంటున్నారు. బీజేపీ గెలిస్తేనే మేలు ప్రజలకు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ ప్రచారం మీద రాములమ్మ సానుకూలంగా ఉన్నారని అర్ధం అంటునారు. ఆమె కేసీయార్ మీద పోటీకి రెడీ అన్నది ఆమె రియాక్షన్ బట్టి అర్ధం అవుతోంది.

బీజేపీకి కూడా రాములమ్మను మించిన ఆప్షన్ లేదు అని అంటున్నారు. ఒకనాడు టీయారెస్ లో ఉంటూ వచ్చిన రాములమ్మ కేసీయార్ ని అన్నా అని పిలిచేవారు. ఈ ఇద్దరే తెలంగాణా వచ్చే టైం లో ఎంపీలుగా పార్లమెంట్ లో ఉండేవారు ఆ తరువాత విజయశాంతి కాంగ్రెస్ బీజేపీ ఇలా పార్టీలు మారారు. ఈ మధ్యదాకా బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారని విజయశాంతి మీద ప్రచారం సాగింది. ఆమె ఇపుడు కామారెడ్డి సీటులో పోటీకి రెడీ అవుతున్నారు అంటే ఆమెకు పార్టీ ప్రయారిటీ ఇస్తొందని అంటున్నారు. అలాగే కేసీయార్ తో పోటీ అంటే గెలుపు సంగతి పక్కన పెడితే అది భారీ ఇమేజ్ ని కూడా ఇస్తుంది. కాబట్టి రాములమ్మ నేను పోటీకి సిద్ధం అంటున్నారు.