Begin typing your search above and press return to search.

విజయసాయి మీద బలమైన ముద్ర చెరిగేనా ?

ఎవరికైనా ఒక ముద్ర ఉండాలని కోరుకుంటారు. ఆ ముద్ర వల్ల వారు బాగా ఎలివేట్ అవుతారు. అందలాలు అందుకుంటారు. కీలక స్థానాలకు చేరుకుంటారు. అయితే వ్యవహరం చెడిపోయాక ఆ బంధనాలు తెంపుకోవాలంటే ఆ బలమైన ముద్ర ఇబ్బంది పెడుతుంది. ఎంత చాకిరేవు పెట్టుకున్నా చెరగని ముద్రగా మారి తెగ చికాకు పెడుతుంది. ప్రస్తుతం వైసీపీ మాజీ నాయకుడు వి విజయసాయిరెడ్డి అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారా అన్నదే చర్చ. ఆయన స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. యాక్సిడెంటల్ పొలిటీషియన్ అని చెప్పాలేమో. ఆయన వైఎస్సార్ కుటుంబానికి మూడు తరాలుగా ఆడిటర్. ఆ కుటుంబానికి ఆ విధంగా అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. జగన్ కాంగ్రెస్ నుంచి వేరు పడినప్పుడు ఆయన వ్యాపారాల విషయంలో అక్రమాస్తులు కూడబెట్టారు అంటూ సీబీఐ కేసులు పడ్డాయి. ఆయన వ్యాపార వ్యవహారాలను చూసే విజయసాయిరెడ్డి కూడా అలా ఏటూగా ఈ కేసులలోకి వచ్చారు. ఇద్దరికీ పదహారు నెలల జైలు బంధం అయిపోయింది. ఎటూ కుటుంబ సన్నిహితుడు తమకు విశ్వాసపాత్రుడని జగన్ తాను పెట్టిన కొత్త పార్టీలో ఆయనను తీసుకుని ప్రోత్సహించారు ఇక విజయసాయిరెడ్డికి కూడా ఎక్కడో రాజకీయంగా మోజు ఉండడంతో చేరారు అయితే విజయసాయిరెడ్డి తానే ఒకానొక సందర్భంలో చెప్పినట్లుగా వైసీపీలో జగనే సర్వస్వం. ఆయన తలచుకుంటే తన లాంటి వారిని ఎందరినో తయారు చేయగలరు అని అన్నారు. అది వ్యంగ్యంగా అన్నా వేరే విధంగా అన్నా కూడా వైసీపీలో జగనే కీలకం. ఆయన చుట్టూనే పార్టీ. ఇక తాను వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో రీసెంట్ గా మరోమారు విజయసాయిరెడ్డి తన బాధను వెళ్ళగక్కారు. తన స్థానం నంబర్ టూ నుంచి 2000 కి పడిపోయిందని అన్నారు. మొత్తానికి అసంతృప్తి మొదలై అసమ్మతిగా మారి చివరికి ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారు అన్నది నిజం. సరే వైసీపీని వీడారు. ఆయన చెప్పినట్లుగా వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ ఇంతలా రాజకీయాన్ని చూసిన ఆయన మళ్ళీ ఈ వైపునకు వచ్చేందుకే చూస్తారు కదా. అయితే రావాలీ అంటే పాత ముద్రలు ఆ వైసీపీ పాద ముద్రలూ అన్నీ తొలగిపోవాలి. దాంతోనే ఆయన వైసీపీ కోట మీద కోటరీ మీద విమర్శలు చేస్తున్నారు. ఇందులో ఆయన మరచిపోతున్న లాజిక్ పాయింట్ ఏంటి అంటే తానూ ఆ కోటలోనే నిన్నటిదాకా ఉన్నాను అని తానూ కోటరీలో ఉన్నాను అని. అందుకే ఆయన విమర్శలు అంతగా పదును ఎక్కడం లేదు. ఇక వైసీపీ తనకు శాశ్వతామనుకుని ఆయన ప్రత్యర్థుల మీద హాటూ ప్లస్ ఘాటూ మిక్స్ చేసి విమర్శలు చేశారు. ఇపుడు అవే వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన వైసీపీని వీడిన మనిషిని మారిన మనిషిని అని చెప్పుకుంటున్నా వైసీపీ వైరి పక్షాలు అంతగా విశ్వసిస్తాయా అన్నది బిగ్ క్వశ్చన్. బీజేపీలో చేరాలని అనుకున్నా ఏపీలో ఆ పార్టీ రాజకీయం పరిమితం. ఇక్కడ పెద్దన్న టీడీపీ చిన్నన్న జనసేన మాత్రమే. మరి ఆ పార్టీలను ఒప్పించి మెప్పించాలంటే వైసీపీ కోట మీద రాళ్ళు వేయాల్సిందే. అలాగే తన మీద వైసీపీ ముద్ర తగ్గించుకోవాల్సిందే. ప్రస్తుతం అదే పనిలో ఆయన బిజీగా ఉన్నారని అంటున్నారు. మరి సక్సెస్ అవుతారా లేక సాయం చేసే వ్యవసాయం చేయి అందుకుంటారా అన్నది వెయిట్ అండ్ సీ.

By:  Tupaki Desk   |   22 April 2025 5:30 AM
విజయసాయి మీద బలమైన ముద్ర చెరిగేనా ?
X

ఎవరికైనా ఒక ముద్ర ఉండాలని కోరుకుంటారు. ఆ ముద్ర వల్ల వారు బాగా ఎలివేట్ అవుతారు. అందలాలు అందుకుంటారు. కీలక స్థానాలకు చేరుకుంటారు. అయితే వ్యవహరం చెడిపోయాక ఆ బంధనాలు తెంపుకోవాలంటే ఆ బలమైన ముద్ర ఇబ్బంది పెడుతుంది. ఎంత చాకిరేవు పెట్టుకున్నా చెరగని ముద్రగా మారి తెగ చికాకు పెడుతుంది.

ప్రస్తుతం వైసీపీ మాజీ నాయకుడు వి విజయసాయిరెడ్డి అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారా అన్నదే చర్చ. ఆయన స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. యాక్సిడెంటల్ పొలిటీషియన్ అని చెప్పాలేమో. ఆయన వైఎస్సార్ కుటుంబానికి మూడు తరాలుగా ఆడిటర్. ఆ కుటుంబానికి ఆ విధంగా అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు.

జగన్ కాంగ్రెస్ నుంచి వేరు పడినప్పుడు ఆయన వ్యాపారాల విషయంలో అక్రమాస్తులు కూడబెట్టారు అంటూ సీబీఐ కేసులు పడ్డాయి. ఆయన వ్యాపార వ్యవహారాలను చూసే విజయసాయిరెడ్డి కూడా అలా ఏటూగా ఈ కేసులలోకి వచ్చారు. ఇద్దరికీ పదహారు నెలల జైలు బంధం అయిపోయింది. ఎటూ కుటుంబ సన్నిహితుడు తమకు విశ్వాసపాత్రుడని జగన్ తాను పెట్టిన కొత్త పార్టీలో ఆయనను తీసుకుని ప్రోత్సహించారు ఇక విజయసాయిరెడ్డికి కూడా ఎక్కడో రాజకీయంగా మోజు ఉండడంతో చేరారు

అయితే విజయసాయిరెడ్డి తానే ఒకానొక సందర్భంలో చెప్పినట్లుగా వైసీపీలో జగనే సర్వస్వం. ఆయన తలచుకుంటే తన లాంటి వారిని ఎందరినో తయారు చేయగలరు అని అన్నారు. అది వ్యంగ్యంగా అన్నా వేరే విధంగా అన్నా కూడా వైసీపీలో జగనే కీలకం. ఆయన చుట్టూనే పార్టీ. ఇక తాను వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో రీసెంట్ గా మరోమారు విజయసాయిరెడ్డి తన బాధను వెళ్ళగక్కారు. తన స్థానం నంబర్ టూ నుంచి 2000 కి పడిపోయిందని అన్నారు.

మొత్తానికి అసంతృప్తి మొదలై అసమ్మతిగా మారి చివరికి ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారు అన్నది నిజం. సరే వైసీపీని వీడారు. ఆయన చెప్పినట్లుగా వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ ఇంతలా రాజకీయాన్ని చూసిన ఆయన మళ్ళీ ఈ వైపునకు వచ్చేందుకే చూస్తారు కదా. అయితే రావాలీ అంటే పాత ముద్రలు ఆ వైసీపీ పాద ముద్రలూ అన్నీ తొలగిపోవాలి. దాంతోనే ఆయన వైసీపీ కోట మీద కోటరీ మీద విమర్శలు చేస్తున్నారు.

ఇందులో ఆయన మరచిపోతున్న లాజిక్ పాయింట్ ఏంటి అంటే తానూ ఆ కోటలోనే నిన్నటిదాకా ఉన్నాను అని తానూ కోటరీలో ఉన్నాను అని. అందుకే ఆయన విమర్శలు అంతగా పదును ఎక్కడం లేదు. ఇక వైసీపీ తనకు శాశ్వతామనుకుని ఆయన ప్రత్యర్థుల మీద హాటూ ప్లస్ ఘాటూ మిక్స్ చేసి విమర్శలు చేశారు. ఇపుడు అవే వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన వైసీపీని వీడిన మనిషిని మారిన మనిషిని అని చెప్పుకుంటున్నా వైసీపీ వైరి పక్షాలు అంతగా విశ్వసిస్తాయా అన్నది బిగ్ క్వశ్చన్. బీజేపీలో చేరాలని అనుకున్నా ఏపీలో ఆ పార్టీ రాజకీయం పరిమితం.

ఇక్కడ పెద్దన్న టీడీపీ చిన్నన్న జనసేన మాత్రమే. మరి ఆ పార్టీలను ఒప్పించి మెప్పించాలంటే వైసీపీ కోట మీద రాళ్ళు వేయాల్సిందే. అలాగే తన మీద వైసీపీ ముద్ర తగ్గించుకోవాల్సిందే. ప్రస్తుతం అదే పనిలో ఆయన బిజీగా ఉన్నారని అంటున్నారు. మరి సక్సెస్ అవుతారా లేక సాయం చేసే వ్యవసాయం చేయి అందుకుంటారా అన్నది వెయిట్ అండ్ సీ.