Begin typing your search above and press return to search.

"పిల్లల ముందే నా సోదరిని..." హమాస్‌ ఉగ్రదాడిపై నటి ఆవేదన!

తాజాగా హమాస్ దాడిలో తన సోదరి, ఆమె భర్తను దారుణంగా చంపేశారంటూ బుల్లితెర నటి మధురా నాయక్ కన్నీటి పర్యంతమయ్యారు.

By:  Tupaki Desk   |   11 Oct 2023 3:14 PM GMT
పిల్లల ముందే నా సోదరిని... హమాస్‌  ఉగ్రదాడిపై నటి ఆవేదన!
X

ఇజ్రాయెల్‌ - హమాస్‌ ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఎన్నో దారుణ సంఘటనలు జరుగుతున్న సంఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మ్యూజిక్ ఫెస్టివల్ లో హమాస్ ముష్కరులు జరిపిన దాడులు.. పిల్లలు, వృద్ధులను సైతం బంధీలుగా తీసుకెళ్తున్న ఘటనలు, చనిపోయినట్లు నటించినప్పటికీ శ్వాస చెక్ చేసిమరీ చంపిన దారుణాలు ఎన్నో ఎన్నెన్నో ఇజ్రాయేల్ గడ్డపై జరుగుతున్నాయి.

ఈ దాడుల్లో అమాయక ప్రజలు చనిపోతున్న ఘటనలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఇందులో భాగంగా... తాజాగా హమాస్ దాడిలో తన సోదరి, ఆమె భర్తను దారుణంగా చంపేశారంటూ బుల్లితెర నటి మధురా నాయక్ కన్నీటి పర్యంతమయ్యారు. పిల్లల ముందే ఈ దారుణానికి ఒడిగట్టారని చెబుతూ.. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం అది వైరల్‌ గా మారింది.

ఈ వీడియోలో స్పందించిన నటి మధురా... అక్టోబర్‌ 7న జరిగిన దాడిలో తన సోదరిని, ఆమె భర్తను.. వారి పిల్లల ముందే దారుణంగా చంపేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ లో ఉన్న బాధితులందరి కోసం ప్రార్థిస్తున్నామని, ఉగ్రవాదుల అరాచకాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని ఆమె తెలిపారు.

ఇదే సమయంలో... పట్టపగలే మహిళలను, పిల్లలను, వృద్ధులను చంపేస్తున్నారని తెలిపిన ఆమె... ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్‌ ప్రజలకు అండగా నిలవండని.. బాధిత కుటుంబాల కోసం దయచేసి అందరూ ప్రార్థించండి అని వేడుకొంటూ అంటూ ఎమోషనల్‌ వీడియో పోస్ట్‌ చేశారు. అదేవిధంగా... ఇప్పటి వరకు జరిగిన ఉగ్రదాడిలో చాలా మంది బంధువులను కోల్పోయానని, వారందరి ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు.

కాగా... హైఫా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్‌ వెళ్లిన బాలీవుడ్ నటి నుస్రత్ భరూచా యుద్ధ సమయంలో అక్కడ చిక్కుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమె సురక్షితంగా భారత్‌ కు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు అక్కడ ఎదురైన భయానక అనుభవాన్ని ఇన్‌ స్టాలో పంచుకున్నారు.